ఉచిత హామీలు ఇచ్చి ప్రజలను ముంచేస్తున్న ఆ ప్రభుత్వం తీరు ఇదే, ప్రధాని మోదీ!
పూణే/ముంబాయి: కర్ణాటక, రాజస్థాన్లలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలపై నిప్పులు చెరిగిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ పార్టీ ఇచ్చిన ఉచిత హమీలపై విమర్శలు గుప్పించారు. మంగళవారం పూణేలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ప్రభుత్వం తప్పుడు మనుషుల చేతుల్లోకి వెళ్లినప్పుడు పౌరులు, సమాజం పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేశారు.
పూణే మెట్రో రైలు రెండో దశను ప్రారంభించేందుకు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను అందజేసేందుకు, వ్యర్థాలకు ఇంధనం నింపే ప్లాంట్ను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పూణే చేరుకున్నారు. మహారాష్ట్రలో రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి చెందుతోందని, అయితే కర్ణాటకలో ఏం జరుగుతుందో అని దేశం మొత్తం చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

ఉచిత హామీల ప్రకటనలు చేయడం ద్వారా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తీరు, దాని దుష్పరిణామాలపై దేశం మొత్తం ఆందోళన చెందుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన ఐదు ఉచిత హామీల పథకాల గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లు సాధించింది, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్లకు ఐదు ఉచిత వాగ్దానాలు చేసిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హామీలను నెరవేర్చడం ప్రారంభించిందని, ఒక రాజకీయ పార్టీ తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తే, యువతరం భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడిందిని, రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.
ఈ ఉచిత హామీల నినాదాలు పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు దోహదపడతాయని, అయితే ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఐదు వాగ్దానాలను అమలు చేస్తామనే సాకుతో రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించేందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ నిరాకరించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ప్రజల ప్రయోజనాలకు ఉచిత హామీలు ఇవ్వాలని, బావితరాలను నిలువునా ముంచేయడానికి ప్రయత్నించకూడదని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications