విద్యార్థినిపై లైంగిక వేధింపులు: ప్రిన్సిపాల్, టీచర్ అరెస్ట్
పోలీసుల కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి. ఆశ్రంశాల పాఠశాల ప్రిన్పిపాల్ కిరణ్ కోలి పటేల్(46), ఉపాధ్యాయిని లలితా దేశాయి సహాయంతో పాఠశాలలోని విద్యార్థినిపై వేధింపులకు పాల్పడ్డారు. గురువారం రోజున కిరణ్ కోలి పటేల్ గదిలో ఆ మైనర్ బాలికను విడిచి పెట్టిన లలితా దేశాయి, అక్కడి నుంచి వెళ్లిపోయిందని గ్రామస్తులు తెలిపారు. ఇదే విధంగా ఇంతకుముందు నాలుగు ఐదుసార్లు జరిగిందని, బాలికపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని గ్రామస్తులు ఆరోపించారు.
కాగా బాధితురాలు, నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం వల్సాద్లోని ఆస్పత్రికి తరలించినట్లు కాప్రడ ఎస్ఐ సిఎన్ పార్మర్ తెలిపారు. ఉపాధ్యాయిని లలితా దేశాయి తరచూ బాధితురాలిని ప్రిన్సిపాల్ గదికి తీసుకెళ్లి, అక్కడ ఆమెను వదిలేసి వచ్చేదని పాఠశాల విద్యార్థులు తెలిపినట్లు ఆయన చెప్పారు.
కాగా ప్రిన్సిపాల్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆయన తెలిపారు. వారు నవసరి జిల్లాలోని సమ్రోలి గ్రామంలో ఉంటున్నారని చెప్పారు. బాధితురాలికి సంబంధించిన వైద్య నివేదిక వచ్చిన తర్వాత నేరం రుజువవుతందని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ నిపుర్ణ తర్వానే తెలిపారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన గ్రామస్తులకు హామీ ఇచ్చారు.