పుల్వామా అప్ డేట్స్ .. క్షణ క్షణం మారుతోన్న పరిణామాలు.. రాజ్ నాథ్ తో ఐబీ, రా చీఫ్, దోవల్ భేటీ
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యంలో ఢిల్లీ రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. మధ్యాహ్నం అఖిలపక్ష సమావేశం నిర్వహించాక .. తదుపరి కార్యాచరణ కోసం కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో రా చీఫ్ ధస్మానా, ఇంటెలెజెన్స్ అడిషనల్ డైరెక్టర్ అరవింద్ కుమార్, కేంద్ర హెంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌవ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. ప్రధానంగా పుల్వామా దాడి .. తదుపరి తమ కార్యాచరణపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
హై అలర్ట్ ..
పుల్వామాలో ఉగ్ర మూకల దాడి అనంతరం .. కశ్మీర్ లోని కొందరు విద్యార్థులకు, స్థానికులకు బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను హోంశాఖ ఆదేశించింది.

వీరజవాన్ల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా
పుల్వామా దాడిలో నెలకొరిగిన భారతమాత ముద్దుబిడ్డల త్యాగాన్ని యావత్ భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. వారి కుటుంబాలకు ఆర్థికసాయం, ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటిస్తోంది. ఉగ్ర మూక దాడిలో ఆసువులు బాసిన జవాన్లకు ఏపీ సర్కార్ రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
వారిపై చర్యలు తీసుకోండి
పుల్వామా ఉగ్ర మూకలతో పాటు పఠాన్ కోట్, యురి దాడి చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని శివసేన డిమాండ్ చేసింది. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో అణచివేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ఆ పార్టీ నేత సంజయ్ రౌత్.












Click it and Unblock the Notifications