Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Puneeth Rajkumar: పవర్ స్టార్ ను నీఛంగా మాట్లాడుతూ పోస్టు, చిక్కితో కొడుక్కి కోలాటం గ్యారెంటి !

బెంగళూరు: శ్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడంతో కర్ణాటక ప్రజలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులతో సహ తెలుగు చిత్రపరిశ్రమ, తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు దేశ విదేశాల్లోని భారతీయులు సంతాపం వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ ఒక హీరోనే కాకుండా ఆయన చేసిన సమాజసేవకు వెలకట్లలేమని అనేక మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ మరణం కన్నడిగులను కలచివేసిన విషయం తెలిసిందే. అయితే ఓ కిరాకతకుడు పునీత్ రాజ్ కుమార్ మరణించాడని, అందు కోసమే బెంగళూరులో మూడు రోజులు మద్యం విక్రయాలు బ్యాన్ చేశారని రగిలిపోయాడు. బీర్ బీటిల్ చేతిలో పెట్టుకున్న ఆ నీఛుడు రేపటి నుంచి మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు, మద్యం తాగి పునీత్ రాజ్ కుమార్ సమాధి దగ్గర.....! అంటూ నీఛంగా వ్యాఖ్యలు చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పునీత్ రాజ్ కుమార్ పట్ల అవహేళనగా సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో కన్నడిగులు మండిపడుతున్నారు. స్వయంగా బెంగళూరు నగర పోలీసు కమీషనర్ రంగంలోకి దిగారంటే ఈ విషయం ఎంత సీరియస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ హీరో కిచ్చ సుధీప్ కూతురితో పాటు వేలాది మంది నెటిజన్లు ఆ కిరాతకుడిని అరెస్టు చేసి తగిన బుద్ది చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను నీఛంగా మాట్లాడి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆ నా కొడుకు చిక్కితే కోలాటం గ్యాంరెటీ అంటున్నారు పోలీసులు.

ధైర్యం చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ

ధైర్యం చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ

శ్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడంతో కర్ణాటక ప్రజలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులతో సహ తెలుగు చిత్రపరిశ్రమ, తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు దేశ విదేశాల్లోని భారతీయులు సంతాపం వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ ధైర్యం చెప్పారు.

బెంగళూరులో మద్యం విక్రయాలు బ్యాన్

బెంగళూరులో మద్యం విక్రయాలు బ్యాన్

పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడంతో ఆయన అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు బెంగళూరులో మద్యం విక్రయాలు బ్యాన్ చెయ్యాలని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలనే ఉద్దేశంతో బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్, బెంగళూరు జిల్లాధికారి మంజునాథ్ ఆదేశాలు జారీ చేశారు. పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఆదివారం ఉదయం పూర్తి అయ్యాయి. పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు పూర్తి అయిన తరువాత మూడు రోజులకు బెంగళూరులో మద్యం విక్రయాలు మొదలైనాయి.

హీరో మాత్రమే కాదు.... సమాజసేవలో యువహీరో ఫస్ట్

హీరో మాత్రమే కాదు.... సమాజసేవలో యువహీరో ఫస్ట్

పునీత్ రాజ్ కుమార్ ఒక హీరోనే కాకుండా ఆయన చేసిన సమాజసేవకు వెలకట్లలేమని అనేక మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ మరణం కన్నడిగులను కలచివేసిన విషయం తెలిసిందే. కొన్ని వేల మంది అనాథలను పునీత్ రాజ్ కుమార్ ఇంతకాలం ఆదుకుంటూ వచ్చాడని ఆయన మరణించిన తరువాత ప్రపంచం మొత్తం తెలిసింది.

వీడికి మందు ముఖ్యం..... మనుషులు కాదు

వీడికి మందు ముఖ్యం..... మనుషులు కాదు

శ్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇక లేడని కన్నడిగులు తల్లడిల్లుతుంటే ఓ కిరాకతకుడు పునీత్ రాజ్ కుమార్ మరణించాడని, అందు కోసమే బెంగళూరులో మూడు రోజులు మద్యం విక్రయాలు బ్యాన్ చేశారని రగిలిపోయాడు. బీర్ బీటిల్ చేతిలో పెట్టుకున్న ఆ నీఛుడు రేపటి నుంచి మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు, మద్యం విక్రయాలు ఆపలేరు అంటూ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

నీఛంగా పోస్టు చేసిన లోఫర్

నీఛంగా పోస్టు చేసిన లోఫర్

రేపు మేము మద్యం సేవించి పునీత్ రాజ్ కుమార్ సమాధి దగ్గరకు వెళ్లి ఆసమాధి మీద.....! అంటూ నీఛంగా వ్యాఖ్యలు చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో, ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. పునీత్ రాజ్ కుమార్ ను దూషిస్తూ ఆ నీఛుడు చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శ్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పట్ల అవహేళనగా సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో కన్నడిగులు మండిపడుతున్నారు.

 రగిలిపోతున్న పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్

రగిలిపోతున్న పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్


స్వయంగా బెంగళూరు నగర పోలీసు కమీషనర్ రంగంలోకి దిగారంటే ఈ విషయం ఎంత సీరియస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ హీరో కిచ్చ సుధీప్ కూతురితో పాటు వేలాది మంది నెటిజన్లు ఆ కిరాతకుడిని అరెస్టు చేసి తగిన బుద్ది చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక పునీత్ రాజ్ కుమార్ అభిమానులు అయితే వాడు కనపడితే వాడి అంతు చూడాలని వేచి చూస్తున్నారు. ప్రముఖ హీరో కిచ్చ సుధీప్ కూతురు సాన్వి కూడా ఆ నీఛుడి మీద మండిపడింది. ప్రముఖఉలతో పాటు వేలాది మంది నెటిజన్లు, పునీత్ రాజ్ కుమార్ అభిమానులు ఆ కిరాతకుడిని అరెస్టు చేసి తగిన బుద్ది చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Recommended Video

    Vishal చర్య ప్రతీ Star Hero కి పాఠం.. ఇదీ కదా హీరోయిజం అంటే || Oneindia Telugu
    రంగంలోకి దిగిన సిటీ పోలీసు కమీషనర్

    రంగంలోకి దిగిన సిటీ పోలీసు కమీషనర్

    ఉత్తర భారతదేశానికి చెందిన రిత్విక్ కేఎస్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో అకౌంట్ లో పునీత్ రాజ్ కుమార్ గురించి అవహేళనగా మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారని, అతన్ని అరెస్టు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి పోస్టులు పెట్టేవారి మీద చర్యలు తీసుకోవడానికి సైబర్ పోలీసులను రంగంలోకి దింపామని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కమల్ పంత్ మీడియాకు చెప్పారు. చనిపోయిన వ్యక్తి గురించి లిక్కర్ కోసం ఇంత నీఛంగా మాట్లాడిన కిరాతకుడికి నరాలు పిండేయాలని పోలీసులు డిసైడ్ అయ్యారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+