పంజాబ్ హైకోర్టు సంచలన తీర్పు.. దోషి నుంచి బాధితురాలికి 90 లక్షల పరిహారం
చండీఘడ్ : పంజాబ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషికి తగిన బుద్ధి చెప్పింది. అత్యాచారం కేసులో విచారణ ఎదుర్కొంటున్న నిషాన్ సింగ్ కు షాక్ ఇచ్చింది. ఫరీద్ కోట్ జిల్లాకు చెందిన మైనర్ బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన ఘటనలో అతడు నిందితుడు. విచారణలో నిజనిజాలు తెలుసుకున్న న్యాయస్థానం.. నిషాన్ సింగ్ కు జీవిత ఖైదు విధించింది. అతడికి చెందిన మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమిని అమ్మి.. బాధితురాలికి న్యాయం చేయాలని ఆదేశించింది.

కోర్టు తీర్పుతో రంగంలోకి దిగిన జిల్లా అధికారులు ఆ భూమిని అమ్మేందుకు వేలం పాట నిర్వహించారు. రెడ్ క్రాస్ సొసైటీ దాదాపు 90 లక్షలకు వేలం పాడి ఆ పొలం దక్కించుకుంది. దీంతో బాధితురాలైన మైనర్ బాలికకు 50 లక్షల రూపాయలు, ఆమె తల్లికి 20 లక్షలు, తండ్రికి 20 లక్షలు అందించారు.












Click it and Unblock the Notifications