గుజరాత్లో భూకంపం.. 5 తీవ్రతతో ప్రకంపనాలు
ఇటీవల దేశంలో భూకంపాలు సంభవిస్తున్నాయి. తీవ్రత తక్కువగానే ఉన్నా.. వరసగా భూమి కంపిస్తోంది. ఈ మధ్య జగిత్యాల జిల్లాలో పలు చోట్ల భూకంపం సంభవించింన సంగతి తెలిసిందే. ఇవాళ గుజరాత్లో ప్రకంపనాలు వచ్చాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వారంతా భయాందోళనకు గురయ్యారు.

Recommended Video
మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల సమయంలో కొద్ది క్షణాల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5గా ఉంది. ద్వారకకు ఉత్తర వాయువ్య దిశగా 223 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంప ప్రభావంతో జనం భయపడ్డారు. భూకంపంతో ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. కానీ మాత్రం టెన్షన్కు గురయ్యారు.
ఉత్తర భారతదేశంలో తరచూ సంభవిస్తున్న భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు. భూకంపం ప్రభావం చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా కనిపించిందని.. పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు.
అసోంలో కూడా గురువారం ఉదయం భూకంపం వచ్చింది. తేజ్పూర్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 3.7గా నమోదయ్యింది.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications