రైలు ప్రయాణికులకు అలర్ట్: లగేజీ ఎక్కువైతే జరిమానా బాదుడే!
రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. మీ లగేజీ బరువు గనుక నిర్ణీత పరిమితి కంటే ఎక్కువగా ఉంటే ఇకపై జరిమానా తప్పదు. దీనికి సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్సభలో పూర్తి వివరాలను వెల్లడించారు. రైలులో ప్రయాణించే వారు తమ వెంట ఎంత లగేజీ తీసుకెళ్లాలనే దానిపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. విమానాశ్రయాల్లో ఉన్నట్లుగానే రైల్వేలో కూడా లగేజీ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
క్లాస్ వారీగా లగేజీ పరిమితులు
సాధారణంగా రైల్వేలో ప్రయాణించే కోచ్ను బట్టి లగేజీ బరువు మారుతూ ఉంటుంది. మంత్రి వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు అత్యధికంగా 70 కిలోల వరకు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అలాగే ఏసీ 2-టైర్ వారికి 50 కిలోలు, ఏసీ 3-టైర్, స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు 40 కిలోల వరకు ఉచిత అనుమతి ఉంటుంది. ఇక సెకండ్ క్లాస్ (జనరల్) లో ప్రయాణించే వారు గరిష్టంగా 35 కిలోల వరకు ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా లగేజీని వెంట ఉంచుకోవచ్చు.

అదనపు బరువుకు 1.5 రెట్ల జరిమానా
నిర్ణీత ఉచిత పరిమితి కంటే ఎక్కువ బరువు ఉన్న లగేజీని వెంట తీసుకెళ్లడం చట్టవిరుద్ధమని రైల్వే స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా ప్రయాణికులు తమ పరిమితి కంటే ఎక్కువ బరువు ఉన్నట్లు చెకింగ్లో దొరికిపోతే, ఆ అదనపు బరువుకు సాధారణ పార్శిల్ రేటు కంటే 1.5 రెట్లు ఎక్కువ పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుంది. అయితే నిర్ణీత రుసుము చెల్లించి గరిష్ట పరిమితి వరకు లగేజీని తీసుకెళ్లే వెసులుబాటు కూడా ఉంది. ఉదాహరణకు ఏసీ ఫస్ట్ క్లాస్లో రుసుము చెల్లిస్తే 150 కిలోల వరకు, స్లీపర్ క్లాస్లో 80 కిలోల వరకు అనుమతిస్తారు.
లగేజీ పరిమాణంపై కూడా నిబంధనలు
కేవలం బరువు మాత్రమే కాకుండా ప్రయాణికులు తమ వెంట తెచ్చుకునే సూట్కేసులు, బాక్సులు లేదా ట్రంకు పెట్టెల పరిమాణంపై కూడా రైల్వే శాఖ ఆంక్షలు విధించింది. ప్రయాణికుల వ్యక్తిగత లగేజీ గరిష్టంగా 100 సెం.మీ x 60 సెం.మీ x 25 సెం.మీ పరిమాణంలో మాత్రమే ఉండాలి. ఈ కొలతలలో ఏ ఒక్కటి మించినా ఆ వస్తువును ప్రయాణికులు కూర్చునే కోచ్లోకి అనుమతించరు. అటువంటి భారీ వస్తువులను ముందుగానే బ్రేక్ వ్యాన్ లేదా పార్శిల్ వ్యాన్లో బుక్ చేసుకోవడం తప్పనిసరి.
ముందస్తు బుకింగ్ ఉత్తమం
ప్రయాణికులు తమ వద్ద అదనపు లగేజీ ఉందని భావిస్తే, స్టేషన్ చేరుకోగానే లగేజీ ఆఫీసులో నిర్ణీత రుసుము చెల్లించి బుక్ చేసుకోవాలని మంత్రి సూచించారు. అలా కాకుండా నేరుగా కోచ్లోకి తీసుకువచ్చిన తర్వాత తనిఖీల్లో దొరికిపోతే, అది రైల్వే నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. ప్రయాణంలో అసౌకర్యం కలగకుండా ఉండాలంటే, రైలు ఎక్కే ముందే తమ బ్యాగుల బరువును ఒకసారి సరిచూసుకోవడం ప్రయాణికులకు శ్రేయస్కరం.
ప్రయాణికులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
"గరిష్ట పరిమితిలో ఉచిత పరిమితి కూడా కలిసి ఉంటుంది. ప్రయాణికులు తమ లగేజీని కోచ్లోకి తీసుకువచ్చే ముందే బుకింగ్ కౌంటర్ వద్ద బుక్ చేసుకోవడం మంచిది. అలా చేయకుండా దొరికిపోతే భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుంది." - అశ్విని వైష్ణవ్, రైల్వే మంత్రి
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications