Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్‌ప్రెస్: నలుగురు మృతి

పాట్నా: ఢిల్లీ - డిబ్రూగర్ మార్గంలోని రాజధాని ఎక్స్‌ప్రెస్ బుధవారం ఉదయం పట్టాలు తప్పింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. ఈ ప్రమాదం బీహార్ రాష్ట్రంలోని ఛాప్రా సమీపంలో జరిరగింది.

నలుగురు మృతి చెందిన విషయాన్ని డిఐజి వినోద్ కుమార్ ఎన్డీటివీతో మాట్లాడుతూ ధ్రువీకరించారు. ఛాప్రా నుంచి తెల్లవారు జామున 2 గంటలకు బయలుదేరిన కొద్ది సేపటికే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది.

ప్రమాదంలో 9 మంది గాయపడినట్లు వినోద్ కుమార్ చెప్పారు. ఈ ప్రమాదం వెనక కుట్ర ఏమీ లేదని ఆయన అన్నారు. డ్రైవర్‌కు ఏ విధమైన పేలుడు శబ్దం వినిపించలేదని చెప్పారు.

 Rajdhani Express derails in Bihar, 4 killed

ట్రాక్స్‌పై శబ్దం రావడంతో రైలును నిలిపేసినట్లు తెలిపారు. రైలుకు చెందిన 11 కోచ్‌లు పట్టాలు తప్పినట్లు సమాచారం. ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మావోయిస్టుల పని కావచ్చునని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమానిస్తోంది.

రైల్వే, స్థానిక అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కుట్ర ఉందని రైల్వే మంత్రిత్వశాఖ అనుమానిస్తుంటే అటువంటదేమీ లేదని బీహార్ పోలీసులు అంటున్నారు.

మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారని, ఈ నేపథ్యంలోనే ఈ సంఘటనకు వారే పాల్పడి ఉండవచ్చునన రైల్వే మంత్రి సదానంద గౌడ అన్నారు. అయితే, అసలు కారణం మాత్రం తెలియదని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+