మైక్రో బ్లాగింగ్ పేజీల్లో క్లాస్ తీసుకుంటున్న నటి రమ్య!
బెంగళూరు: ప్రముఖ కన్నడ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు రమ్య అలియాస్ రమ్య దివ్య స్పందన టీచర్గా మారింది! కన్నడ పదాలు తప్పుగా రాయడం లేదా తప్పుగా పలకడం చేస్తుంటే ఆమె మైక్రో బ్లాగింగ్ పేజీల్లో సూచనలు చేస్తున్నారు. కన్నడను, కర్నాటకను స్వచ్ఛంగా పలకని వారిని ఉద్దేశిస్తూ ఆమె ఓ ట్వీట్ చేశారు.
కెనడా అనే పదాన్ని స్వచ్ఛంగా పలకగలిగినప్పుడు.. కన్నడను ఎందుకు పలకలేరని ఆమె ట్వీట్ చేశారు. ఉత్తరాది వారు ఎక్కువగా కర్నాటక్, కన్నడ్ అంటూ ఉంటారట. దీనిని ఉద్దేశిస్తూ ఆమె మరో ట్వీట్ చేశారు. ఉత్తరాది స్నేహితులకు.. అంటూ ఆమె ట్వీట్ ప్రారంభించారు.

కర్నాటక్ కాదు.. కర్నాటక, ఆంగ్ల భాషలో చివరలో 'ఏ' ఉంటుందని, అలాగే కన్నడ్ కాదని, కన్నడ అంటూ ఆమె నొక్కి చెప్పినట్లుగా ట్వీట్ చేశారు. కర్నాటక, కన్నడల విషయంలో రమ్య ట్వీట్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఆమెకు రాష్ట్రం పట్ల, భాష పట్ల ఉన్న గౌరవం దీని ద్వారా అర్థమవుతోందని అభిమానులు అంటున్నారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications