బ్యాంకులకే డబ్బు.. ఏటీఎంలలో నో క్యాష్..
డబ్బును నేరుగా బ్యాంకులకే పంపించాలని ఆర్బీఐ నిర్ణయించింది.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు కొరత సామాన్యులకు దినదిన గండంగా పరిణమించిన సంగతి తెలిసిందే. పనులన్ని మానుకుని బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. దేశంలో చాలావరకు ఏటీఎంలు నో క్యాష్ బోర్డుతోనే దర్శనమిస్తుండటంతో కష్టాలు మరింత ఎక్కువవుతున్నాయి.
తాజాగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం సామాన్యుడి కష్టాలను రెట్టింపు చేసేలా మారింది. డబ్బును ఏటీఎంలకు కాకుండా బ్యాంకులకే పంపించాలని ఆర్బీఐ నిర్ణయించింది. దీంతో ఏటీఎంలలో మరికొన్ని రోజుల పాటు నగదు అందుబాటులో ఉండదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2.10లక్షల ఏటీఎంలు ఉండగా కేవలం 27వేల ఏటీఎంలలో మాత్రమే నగదు అందుబాటులో ఉంటుంది.

గత నెలలో 30శాతం ఏటీఎంలలో డబ్బును నింపగా ప్రస్తుతం 13శాతం మాత్రమే ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉంటుంది. తాజాగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం దీనిపై మరింత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. నోట్ల రద్దును అమలుపరిచి నెలరోజులు దాటిపోతున్నా.. ఇప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడం సామాన్యుల్లో ఆందోళనను మరింత పెంచుతోంది.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications