Ayodhya Ram Temple: రామమందిర ప్రాణప్రతిష్టకు శంకరాచార్యుల డుమ్మా అందుకేనా ?
అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం శరవేగంగా పూర్తవుతోంది. మరో వారం రోజుల్లో ఆలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన క్రతువులు రేపు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమయంలో వీటితో పాటు ఆహ్వానాల వ్యవహారం పర్యవేక్షిస్తున్న అయోధ్య ట్రస్టుకు ఓ చిక్కు వచ్చి పడింది. నలుగురు శంకరాచార్యలు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి హాజరు కాబోమని తేల్చిచెప్పేయడమే ఇందుకు కారణం.
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి నలుగురు శంకరాచార్యులు రాకూడదని నిర్ణయం తీసుకోవడంతో వారిపైనా బీజేపీ నేతలు ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు శంకరాచార్యులు ఇంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అందులో ఒకరైన స్వామి నిశ్చలానంద మహరాజ్ తాజాగా వెల్లడించారు. పూరీలోని శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి మహరాజ్ తమ నిర్ణయం వెనుక స్ధాపిత సంప్రదాయాల నుంచి ట్రస్టు దూరంగా జరగడమే ప్రధాన కారణంగా పేర్కొన్నారు.

జాతీయ మీడియా ఛానల్ ఎన్టీటీవీతో నిశ్చలానంద మాట్లాడుతూ.. శంకరాచార్యులు తమ గౌరవాన్ని నిలబెట్టుకుంటారని, ఇది అహంకారానికి సంబంధించిన విషయం కాదన్నారు. ప్రధానమంత్రి మోడీ రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు మనం కేవలం బయట కూర్చుని చప్పట్లు కొట్టాలని భావిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. 'సెక్యులర్' ప్రభుత్వం ఉనికిలో ఉండటం అనేది సంప్రదాయాన్ని తుడిచిపెట్టడాన్ని సూచించదని నిశ్చలాంద వ్యాఖ్యానించారు.
-
బరువు తగ్గాలంటే చనా వెజ్ సలాడ్ ఇలా ట్రై చెయ్యండి! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట!












Click it and Unblock the Notifications