వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యాలో చైనాకు షాకిచ్చిన రాజ్‌నాథ్ సింగ్: నమ్మకం, సహకారం ఉండాలంటూ చురకలు

|
Google Oneindia TeluguNews

మాస్కో/న్యూడిల్లీ: రష్యాలో జరిగిన షాంగై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) వేదికగా చైనాకు గట్టి షాకిచ్చారు భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. షాంగై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) రీజియన్ శాంతి భద్రతల కోసం.. నమ్మకం, దురాక్రమణను త్యజించడం, అంతర్జాతీయ నిబంధనలను గౌరవించడం, విభేదాలను శాంతియుతంగా పరిష్కరించే పరిస్థితి ఉండాలని కోరుకుంటున్నట్లు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం చెప్పారు. ఈశాన్య లడఖ్ ప్రాంతంలో చైనా ఘర్షణలకు దిగడాన్ని ఉద్దేశిస్తూ చైనాకు ఆయన పరోక్ష చురకలంటించారు.

చైనా రక్షణ మంత్రి సమక్షంలోనే రాజ్‌నాథ్ ఘాటు వ్యాఖ్యలు

చైనా రక్షణ మంత్రి సమక్షంలోనే రాజ్‌నాథ్ ఘాటు వ్యాఖ్యలు

రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఎస్‌సీఓ మంత్రుల సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. రెండో ప్రపంచ యుద్ధం ద్వారా మనకు తెలిసిందేమంటే.. దూకుడు, దురాక్రమణ కారణంగా విధ్వంసమే మిగులుతుందని అన్నారు. ఈ సమావేశంలో భారత్, చైనా సహా ఎనిమది దేశాలు పాల్గొన్నాయి. భద్రత, రక్షణ అంశాలపై ప్రాథమికంగా ఈ సమావేశంలో చర్చించారు. ‘ప్రపంచ జనాభాలో 40% పైగా ఉన్న SCO సభ్య దేశాల శాంతియుత స్థిరమైన మరియు సురక్షితమైన ప్రాంతం కోరుకుంటున్నదేమంటే.. పరస్పర నమ్మకం, సహకారం, దురాక్రమణ త్యజించడం, అంతర్జాతీయ నియమాలు, నిబంధనలను గౌరవించడం, విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం' అని రాజ్‌నాథ్ పరోక్షంగా డ్రాగన్ దేశానికి చురకలంటించారు. చైనా రక్షణ మంత్రి జనరల్ వీ ఫెంగ్ సమక్షంలోనే రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

రెండో ప్రపంచ యుద్ధం ఏం చెప్పిందంటే..

రెండో ప్రపంచ యుద్ధం ఏం చెప్పిందంటే..

‘ఈ సంవత్సరం రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన 75 వ వార్షికోత్సవం, శాంతియుత ప్రపంచాన్ని బలపరిచేందుకు ఐక్యరాజ్యసమితి ఏర్పడటం, ఇది ఇక్కడ అంతర్జాతీయ చట్టాలు, రాజ్యాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం, రాజ్యాలు మరొక వైపు ఏకపక్ష దూకుడు నుండి దూరంగా ఉంచడం చేస్తోంది' అని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. అంతేగాక, ఉగ్రవాదం, ఉగ్రవాద ముప్పు గురించి కూడా మాట్లాడుతూ.. సవాళ్లను ఎదుర్కోవటానికి సంస్థాగత సామర్థ్యాన్ని కలిగి ఉండాలన్నారు. భారతదేశం ఉగ్రవాదాన్ని అన్ని రకాలుగా, వ్యక్తీకరణలలోనూ "నిస్సందేహంగా" ఖండిస్తుందని, దాని "ప్రతిపాదకులను" ఖండిస్తుందని, న్యూఢిల్లీ.. SCO ప్రాంతీయ తీవ్రవాద నిరోధక నిర్మాణం (RATS) పనులకు విలువ ఇస్తుందన్నారు.

ప్రపంచ శాంతిభద్రతలకు భారత్ కట్టుబడి ఉంది..

ప్రపంచ శాంతిభద్రతలకు భారత్ కట్టుబడి ఉంది..

‘రాడికలిజం, ఉగ్రవాదం వ్యాప్తి చెందకుండా ఉండటానికి సైబర్ డొమైన్‌లో ఇటీవల RATS చేసిన కృషిని మేము అభినందిస్తున్నాము. ఉగ్రవాద ప్రచారం, డి-రాడికలైజేషన్‌ను ఎదుర్కోవటానికి SCO కౌన్సిల్ ఉగ్రవాద నిరోధక చర్యలను అవలంబించడం ఒక ముఖ్యమైన నిర్ణయం' అని రాజ్‌నాథ్ అన్నారు. ‘గ్లోబల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ పరిణామానికి భారతదేశం కట్టుబడి ఉంది, ఇది "బహిరంగ, పారదర్శక, కలుపుకొని, నియమాల ఆధారిత, అంతర్జాతీయ చట్టాలలో లంగరు వేయబడుతుంది' అని ఆయన వ్యాఖ్యానించారు. పెర్షియన్ గల్ఫ్ ప్రాంత పరిస్థితులపై రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశానికి గల్ఫ్‌లోని అన్ని రాష్ట్రాలతో నాగరికత, సంస్కృతి ముఖ్యమైన ఆసక్తులు, సంబంధాలు ఉన్నాయి. పరస్పర గౌరవం, సార్వభౌమాధికారం, ఒకదానికొకటి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా సంభాషణల ద్వారా తేడాలను పరిష్కరించుకోవాలని భారతదేశానికి ప్రియమైన, స్నేహపూర్వక దేశాలన్నింటినీ తాము పిలుస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలను కూడా ఆయన ప్రస్తావించారు.

రష్యాకు అభినందనలు

వార్షిక ఉగ్రవాద నిరోధక పీస్ మిషన్‌ను నిర్వహించినందుకు రష్యాకు సింగ్ కృతజ్ఞతలు తెలిపారు, రక్షణ దళాల మధ్య నమ్మకాన్ని పెంపొందించడానికి, అనుభవాన్ని పంచుకోవడానికి ఇది దోహదపడిందని అన్నారు. ఇక కరోనావైరస్ మహమ్మారి గురించి మాట్లాడుతూ, ప్రకృతి అధిక శక్తులను నివారించడానికి, తగ్గించడానికి మానవాళి తేడాలను మరచిపోవాలని, ఇది ప్రపంచానికి గుర్తుచేస్తుందన్నారు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌కు నాయకత్వం వహించినందుకు రష్యన్ శాస్త్రవేత్తలు, ఆరోగ్య కార్యకర్తలను మేము అభినందిస్తున్నామని ఆయన చెప్పారు. కాగా, గత నాలుగు నెలల నుంచి చైనా దురాక్రమణ కాంక్షతో ఈశాన్య లడఖ్ ప్రాంతంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. దీంతో భారత భద్రతా బలగాలు కూడా డ్రాగన్ దేశానికి ధీటుగానే జవాబు చెబుతున్నాయి. ప్యాంగ్యాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించినా చైనా బలగాలను గట్టిగాప్రతిఘటించిన భారత సైనికులు.. వారిని అక్కడ్నుంచి తరిమికొట్టారు.

English summary
Peace and security in the Shanghai Cooperation Organisation (SCO) region demands a climate of trust, non-aggression, respect for international rules and peaceful resolution of differences, Defence Minister Rajnath Singh said on Friday. His comment was seen as an indirect message to China, which is engaged in a festering border row with India in eastern Ladakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X