రిలయన్స్ టర్నోవర్ రూ.10,00,122 కోట్లు: షేర్ హోల్డర్లకు భారీ రివార్డులు: సంపదను పంచుతాం: అంబానీ
Reliance AGM Mukesh Ambani: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ.. కీలక ప్రకటన చేశారు. కంపెనీ షేర్ హోల్డర్లకు తీపికబురు వినిపించారు. వారికి బోనస్ షేర్లను ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సంస్థ పురోగతిలో వారిని భాగస్వామ్యులను చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశం ముంబైలో ఏర్పాటైంది. 47వ సర్వసభ్య సమావేశం ఇది. ఇందులో ముఖేష్ అంబానీ మాట్లాడారు. సంస్థ ఉద్యోగులు, ప్రతినిధులు, షేర్ హోల్డర్లను ఉద్దేశించి కీలక ప్రకటనలు చేశారు. రిలయన్స్ జియో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంశాన్నీ ప్రస్తావించారు.

ఏడాదికేడాది రిలయన్స్ అద్భుత పురోగతిని సాధిస్తోందని ముఖేష్ అంబానీ అన్నారు. ఇందులో భాగస్వామి అయిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలను తెలియజేస్తున్నానని చెప్పారు. ప్రత్యేకించి- షేర్ హోల్డర్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఈ మధ్యాహ్నం 1:45 నిమిషాలకు స్టాక్ ఎక్స్ఛేంజీలకు పంపించామని ముఖేష్ అంబానీ తెలిపారు. బోనస్ షేర్లను జారీ చేయడానికి సెప్టెంబరు 5వ తేదీన ప్రత్యేకంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశాన్ని నిర్వహించనున్నామని పేర్కొన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ పురోభివృద్ధికి కారణమైన షేర్ హోల్డర్లకు రివార్డులను ఇవ్వనున్నామని, వారికి ప్రతిఫలాన్ని అందజేయాలనేదే తన అభిమతమని అంబానీ వ్యాఖ్యానించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇది శాశ్వతంగా కొనసాగుతుందని పునరుద్ఘాటించారాయన.

స్వల్పకాలిక లాభాలను ఆర్జించడానికో లేక సంపదను కూడబెట్టుకోవడానికో తాము ఈ పారిశ్రామిక, వ్యాపార రంగంలో అడుగు పెట్టలేదని, దేశం సంపదను రెట్టింపు చేయాలనేదే తమ లక్ష్యమని ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. ప్రతి భారతీయుడి జీవన శైలిని మరింత మెరుగుపర్చడానికి అహర్నిశలు కృషి చేస్తోన్నామని అన్నారు.
ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన 2023- 2024 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 10,00,122 కోట్ల రూపాయల రికార్డు టర్నోవర్ను నమోదు చేసింది. వార్షిక ఆదాయంలో 10 లక్షల కోట్ల రూపాయల మార్క్ను అధిగమించింది. అ ఘనత సాధించిన దేశ మొట్టమొదటి కంపెనీగా ఇదే.
రిలయన్స్ ఈబీఐటీడీఏ 1,78,677 కోట్ల రూపాయలు కాగా, నికర లాభం 79,020 కోట్ల రూపాయలు. మూడేళ్లలో కంపెనీ 5.28 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను పెట్టింది. 1,86,440 కోట్ల రూపాయలను వివిధ పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications