షాక్: కస్ఠమర్ల డేటా లీక్, అబ్బే అలాంటిదేమీ లేదన్న జియో
రిలయన్స్జియో కస్టమర్ల డేటా ఆన్లైన్లో లీకైందనే వార్త ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఓ వెబ్సైట్లో అందుబాటులో ఉందనే వార్త జోరుగా విన్పిస్తోంది.అయితే ఈ వార్తలను జియో తీవ్రంగా ఖండించింది.
ముంబై:రిలయన్స్జియో కస్టమర్ల డేటా ఆన్లైన్లో లీకైందనే వార్త ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఓ వెబ్సైట్లో అందుబాటులో ఉందనే వార్త జోరుగా విన్పిస్తోంది.అయితే ఈ వార్తలను జియో తీవ్రంగా ఖండించింది.
లక్షలకొద్దీ రిలయన్స్ జియో కస్టమర్ల వ్యక్తిగా సమాచారం ఆన్లైన్లో మాజిక్ ఏపీకే.కామ్ అనే వెబ్సైట్లో లీకైందనే కథనాలు వచ్చాయి. సంబంధిత వెబ్సైట్ యూఆర్ఎల్ను కొంతమంది ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

జియో కస్టమర్ల ఫోన్ నెంబర్లు ఈ మెయిల్ తదితర సమాచారం ఈ సైట్లో దర్శనమిస్తున్నాయని ట్వీట్ చేయడంతో దుమారం రేగింది. డేటాబేస్ ఉల్లంఘన ఏ మేరకు ఉంది అనేది మాత్రం ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది.
అయితే ఈ వార్తను జియో తీవ్రంగా ఖండించింది. వదంతులను నమ్మవద్దని కోరింది. తమ వినియోగదారుల డేటా సురక్షితంగా ఉందని గట్టిగా వాదిస్తోంది. ఎలాంటి డేటా లీక్ కాలేదని జియో ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. తమ కస్టమర్ల డేటా భద్రంగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన అనంతరం డేటాలీక్ అనేది అవాస్తవమని, నిరాధరమైందని జియో ప్రకటించింది. దీనిపై మరింత విచారణ కొనసాగుతోందన్నారు.












Click it and Unblock the Notifications