దిమ్మ తిరిగే నీరవ్ మోడీ సంపద: రింగ్ రూ.10 కోట్లు, వాచీ రూ.1.40 కోట్లు
Recommended Video

ముంబై: మూడు రోజుల పాటు సిబిఐ, ఈడీ నిర్వహించిన సోదాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసు నిందితుడు నీరవ్ మోడీకి సంబంధించి దిమ్మ తిరిగే సంపద బయటపడింది. ఈ మేరకు శనివారం జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..
సిబిఐ, ఈడి అధికారులు మూడు రోజుల పాటు ముంబైలోని సముద్ర మహల్ నివాసంలో సోదాలు నిర్వహించారు. పెద్ద యెత్తున వస్తువులను వారు స్వాధీనం చేసుకున్నారు. అత్యంత విలువైన వస్తువులు వారికి చిక్కాయి.

రింగ్ విలువ ఇదీ...
సిబిఐ, ఈడి అధికారులకు చిక్కిన రింగ్ విలువ పది కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. వాచీ రూ.1.40 కోట్ల విలువ చేస్తుందని అంటున్నారు. ప్రాచీన ఆభరణాలు, అరుదైన పెయింటింగ్స్ కూడా నీరవ్ మోడీ నివాసంలో ఉన్నాయి. వాటి విలువ కొన్ని లక్షల నుంచి కొన్ని కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంటున్నారు.

విలువ దాదాపు రూ.50 కోట్లు
నీరవ్ మోడీ నివాసంలో స్వాధీనం చేసుకున్న వస్తువుల విలుపను లెక్క కట్టే పనిలో సిబిఐ, ఈడి అధికారులు ఉన్నారు. తమకు చిక్కిన వస్తువుల విలువ రూ.50 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

అది నీరవ్ మోడీ నివాసం.
ముంబైలోని సముద్ర మహల్ నీరవ్ మోడీ నివాసం. ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంక్ను వేల కోట్ల రూపాయలకు ముంచాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారడు ఈ కేసులో ఆయన మేనమామ మెహుల్ చోక్సీపై, తదితరులపై విచారణ జరుగుతోంది. వారు ఇప్పటికే దేశం విడిచి పారిపోయారు.

ఈడి సోదాలు ఇలా.
నీరవ్ మోడీకి చెందిన 21 ఆస్తులను ఈడీ గత నెలలో సీజ్ చేసింది. వాటిలో ఓ పెంట్హౌస్, ఓ ఫామ్ హౌస్ ఉన్నాయి. ఈడీ స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ర.523 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సమన్లు జారీ చేసినప్పటికీ నీరవ్ మోడీ గానీ చోక్సీ గానీ దేశానికి తిరిగి రావడానికి సిద్ధపడడం లేదు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications