రాజా సింగ్ కేసుల విషయంలో కోర్టు తుది నిర్ణయం

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన 2022 నాటి వివాదాస్పద వ్యాఖ్యల కేసులో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టీ రాజా సింగ్‌కు భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన ఈ కేసును హైదరాబాద్‌ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ఆయనపై మోపిన ఆరోపణలు ఏవీ సరైనవి కావని నిర్ధారించిన న్యాయస్థానం రాజాసింగ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ఇరుపక్షాల వాదనలు, సాక్ష్యాధారాలను నిశితంగా పరిశీలించిన తర్వాతే కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

మతవిద్వేషాలు రెచ్చగొట్టడం, ఉద్దేశపూర్వకంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి తీవ్ర ఆరోపణలతో సెక్షన్లు 153ఎ (ఎ) (బి), 295ఎ, 504, 505 (2), 506 కింద మంగళహాట్ పోలీసులు రాజాసింగ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మేజిస్ట్రేట్ పోలీస్ రిమాండ్‌ను తిరస్కరించినప్పటికీ అప్పటి ప్రభుత్వం ఆయనపై పీడీ యాక్ట్ ను ప్రయోగించింది. దీనితో ఆయన దాదాపు 77 రోజుల పాటు జైలులోనే గడపాల్సి వచ్చింది.

Goshamahal MLA Raja Singh Acquitted by Special Court in Hyderabad After PD Detention Over Allegations

ఈ వివాదం నేపథ్యంలోనే అప్పట్లో బీజేపీ అధిష్ఠానం రాజాసింగ్‌ను పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందే ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను పార్టీ ఎత్తివేసి మళ్లీ పార్టీలోకి తీసుకుంది. ఈ అక్రమ కేసుల వల్ల ఆయన రాజకీయ ప్రయాణంపై కొంత ప్రభావం పడినప్పటికీ.. ఇప్పుడు లభించిన కోర్టు క్లీన్‌చిట్‌తో ఆయనకు పెద్ద ఎత్తున ఊరట లభించినట్లయింది.

కోర్టు తీర్పు వెలువడిన అనంతరం రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి పోలీసులు తనపై అక్రమంగా కేసులు బనాయించారని ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపు చర్యల కోసమే తనను 77 రోజుల పాటు అన్యాయంగా జైల్లో ఉంచారని అన్నారు. తాను ఏనాడూ ఏ మత విశ్వాసాలను లేదా ఇతర దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడలేదని, న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకం నేడు నిజమైందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా తనపై కొన్ని అక్రమ కేసులు నమోదయ్యాయని రాజాసింగ్ గుర్తు చేశారు. తాను భయపడబోనని, చట్టరీత్యా పోరాటం సాగిస్తానని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మిగిలిన కేసుల నుంచి కూడా తాను నిర్దోషిగా బయటపడతాననే దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాజాసింగ్ తరఫు హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ దీనిపై మాట్లాడారు. 2022 నాటి ఈ కేసులో ప్రత్యేక కోర్టు సాక్ష్యాధారాల ఆధారంగా సరైన నిర్ణయం తీసుకుందని తెలిపారు.

ఈ వివాదంలో ఫిర్యాదుదారుడినే స్వయంగా కోర్టు ప్రశ్నించిందని, వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను రాజా సింగ్.. ఇస్లామిక్ సాహిత్యం నుంచే సేకరించినట్లు అంగీకరించారని వివరించారు. పోలీసులు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను కూడా పరిశీలించిన కోర్టు.. రాజాసింగ్‌పై మోపిన ఏ ఒక్క కేసు నిలబడదని నిర్ధారిస్తూ ఆయనను నిర్దోషిగా విడుదల చేసిందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+