ఆర్ఎస్ఎస్ ‘గ్రాండ్ ఇఫ్తార్ పార్టీ’కి షాకిచ్చిన సొంత విభాగం
ముంబై: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ముస్లింలకు ఇవ్వనున్న గ్రాండ్ ఇఫ్తార్ పార్టీకి సొంత విభాగమే షాకిచ్చింది. మలబార్హిల్స్లోని సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో సోమవారం సాయంత్రం ఆర్ఎస్ఎస్ గ్రాండ్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ విందుకు 30 దేశాల ముస్లిం ప్రముఖులు, 100 మంది స్వదేశీ ప్రముఖులు హాజరుకానున్నారు.అయితే, ప్రభుత్వ అతిథి గృహంలో ఇఫ్తార్ విందు నిర్వహించొద్దని అర్ఎస్ఎస్ ముస్లిం విభాగం(ముస్లిం రాష్ట్రీయ మంచ్) కార్యకర్తలు అదిల్ ఖత్రీ, షకీల్ అహ్మద్ షేక్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
కాగా, 2015 జులై నెలలో మహారాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వల ప్రకారం.,. ప్రభుత్వ కార్యాలయాల్లో, అతిథి గృహాల్లో పబ్లిక్ మీటింగ్లు, ప్రైవేటు కార్యక్రమాలు నిర్వహించరాదు. గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఉత్తర్వులపై స్పందించాలని, ఆర్ఎస్ఎస్ ఇఫ్తార్ విందుని అడ్డుకోవాలని ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యకర్తలు కోరారు.