ఆరెస్సెస్కు సారీ: సుప్రీం కోర్టు సలహాను తిరస్కరించిన రాహుల్ గాంధీ
ఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీని ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్) చంపిందన్న తన వ్యాఖ్యల పైన భారత అత్యున్నత న్యాయస్థానం చేసిన సూచనను ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గురువారం నాడు తిరస్కరించారు.
రాహుల్ గాంధీ పైన పరువు నష్టం దావా కేసు వేశారు. దీనిపై గురువారం నాడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఆర్ఎస్ఎస్కు క్షమాపణలు చెబితే కేసు విచారణతో పని ఉండదని రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు సలహా ఇచ్చింది.

అయితే, సుప్రీం కోర్టు సలహాను ఆయన తిరస్కరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరెస్సెస్కు క్షమాపణలు చెప్పనని తేల్చేశారు. ఆ కేసులో వాదనకు తాను సిద్ధమన్నారు. రాహుల్ గాంధీ తరపున సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వాదిస్తున్నారు.
ఆయనే రాహుల్ గాంధీ తరపున కోర్టులో అభిప్రాయాన్ని వినిపించారు. వచ్చే ఫిబ్రవరిలో ఈ కేసు విచారణ జరగనుంది. కాగా, గాంధీ హత్యకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘే కారణమంటూ గత ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ ఆరోపించారు. దీంతో ఆర్ఎస్ఎస్కు చెందిన ఓ కార్యకర్త రాహుల్పై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications