Sadist wife: పెళ్లి జరిగిన మూడు నెలలకే భర్త జీవితం ఫినిష్. ఫ్యామిలీ ప్యాకేజ్ టార్చర్, క్లైమాక్స్ లో !
బెంగళూరు/మండ్య: కుటుంబ సభ్యులు ఓ యువతి, యువకుడిని పెళ్లి సెట్ చేశారు. యువతి, యువకుడి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. పెళ్లి జరిగి నెల రోజులు కూడా భర్త ఇంటిలో కాపురం చెయ్యని కొత్త పెళ్లి కూతురు సిటీకి వెళ్లి పోదామని భర్త మీద ఒత్తిడి చేసింది. కొత్త పెళ్లి కూతురు చెప్పినట్లు తల్లిదండ్రులతో పాటు కుటంబ సభ్యులు అందరిని వదిలేసిన భర్త అతని భార్యతో కలిసి సిటీకి చేరుకున్నాడు. కొత్త ఇంటిలో కూడా భార్య ఆమె భర్తను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ప్రతిరోజు దంపతుల మద్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేని భర్త పెళ్లి జరిగి వంద రోజులు కూడా పూర్తి కాకుండానే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
Father: తండ్రిని 30 ముక్కలుగా నరికేసిన కొడుకు, సొంత ఫామ్ హౌస్ లో బోర్ బావిలో వేసి కూల్ గా!
పెద్దలు సెట్ చేసిన పెళ్లి
కర్ణాటకలోని రామనగర జిల్లాలోని చెన్నపట్టణ తాలుకాలోని కడ్లూరు గ్రామంలో మహేశ్వర్ (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మండ్య జిల్లాలోని మద్దూరు తాలుకాలోని హోన్నలగరి గ్రామంలో కవన (22) అనే యువతి నివాసం ఉంటున్నది. కుటుంబ సభ్యులు మహేశ్వర్, కవనల పెళ్లి సెట్ చేశారు. మూడు నెలల క్రితం మద్దూరమ్మ దేవాయంలో కవన, మహేశ్వర్ ల వివాహం జరిగింది. ఇదే రోజు రాత్రి రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది.
నెల రోజులకే బెంగళూరుకు వెళ్లిపోవాలని ?
వివాహం అయిన తరువాత కవన ఆమె భర్త మహేశ్వర్ ఇంటికి వెళ్లింది. ఇంట్లో అత్తమామలు, మరదలు, మరిది ఉంటే ఆమె అక్కడ ఉండలేకపోయింది. పెళ్లి జరిగి నెల రోజులు పూర్తికాకుండానే కవన మనం బెంగళూరు వెళ్లిపోదామని ఆమె భర్త మహేశ్వర్ ను గోకవడం మొదలుపెట్టింది. కొన్ని రోజులు ఇదే విషయంలో మహేశ్వర్, కవన దంపతుల మ్యద చర్చలు జరిగాయి.
బెంగళూరులో కూడా సేమ్ టార్చర్
కొత్తగగా పెళ్ి చేుకున్న మహేశ్వర్ అతని భార్య కవన కోరిక మేరకు బెంగళూరు చేరుకుని ఉల్లాళ సమీపంలోని ఎంవీ. లేఔట్ లో అద్దె ఇల్లు తీసుకుని అక్కడ కాపురం పెట్టాడు. అత్తమామలతో పాటు అందరికి దూరంగా వచ్చినా కవన మాత్రం ఆమె కోరికలు తగ్గించుకోలేదు. ప్రతిరోజు భర్త మహేశ్వర్ కు ఏదో ఒకటి కావాలని కవన టార్చర్ పెట్టింది.
ఆత్మహత్య చేసుకున్న భర్త
తనకు బంగారు నగలు కావాలని, మా నాన్న వ్యాపారం చేసుకోవడానికి రూ. 4 లక్షలు ఇవ్వాలని కవన ఆమె భర్త మహేశ్వర్ ను టార్చర్ పెట్టిందని ఆరోపణలు ఉన్నాయి. బెంగళూరు వచ్చిన తరువాత ఎలా బతకాలి అని ఆలోచిస్తున్న మహేశ్వర్ అతని భార్య కవన టార్చర్ తట్టుకోలేకపోయాడు. ఇలాంటి భార్యతో జీవితాంతం కలసి జీవించలేనని మహేశ్వర్ అనుకున్నాడు.
మూడు నెలలకే జీవితం ముగిసిపోయింది
భార్య కవనకు చాలాసార్లు నచ్చచెప్పడానికి మహేశ్వర్ ప్రయత్నించాడు. అయితే కవన మాత్రం ఎవ్వరిమాట వినకపోవడంతో మహేశ్వర్ జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. భార్య కవన కోరుతు విలాసవంతమైన జీవితం అందించలేనని మహేశ్వర్ డిసైడ్ అయ్యాడు. ఇంటిలో మహేశ్వర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఫ్యామిలీ ప్యాకేజ్ టార్చర్
తన కొడుకు మహేశ్వర్ ఆత్మహత్యకు మా కోడలు కవన, అమె తల్లిదండ్రులు ఆత్మానంద, పద్మా టార్చర్ పెట్టడమే ప్రధాన కారణం అని. మాకొడుకు మహేశ్వర్ కు ఎలాంటి సమస్యలు లేవని, మా కోడలు, ఆమె కుటుంబ సభ్యులు నిత్యం మహేశ్వర్ ను వేధించారని అతని కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో బెంగళూరు పోలీసులు విచారణ చేస్తున్నారు.