ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్: రూ.5వేలకే 46 వేల ఫోన్
ఆన్లైన్ రిటైల్ వెబ్సైట్ ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్ను ప్రకటించింది. రూ.46వేల విలువైన శాంసంగ్ గెలాక్సీ ఎస్7ను కేవలం రూ.5,090కే సొంతం చేసుకునే అద్భుత ఆఫర్ను ప్రకటించింది.
న్యూఢిల్లీ: ఆన్లైన్ రిటైల్ వెబ్సైట్ ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్ను ప్రకటించింది. రూ.46వేల విలువైన శాంసంగ్ గెలాక్సీ ఎస్7ను కేవలం రూ.5,090కే సొంతం చేసుకునే అద్భుత ఆఫర్ను ప్రకటించింది. ఈ నెల 6 నుంచి 8 వరకు నిర్వహిస్తున్న శాంసంగ్ మొబైల్ ఫెస్ట్ ప్రమోషనల్ సేల్స్ కార్యక్రమంలో భాగంగా ఈ ఆఫర్ను అందుబాటులోకి తెచ్చింది.
నిజానికి శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7 అసలు ధర రూ.46 వేలు. దీనిపై రూ.16,010 రాయితీ ప్రకటించిన ఫ్లిప్కార్ట్ రూ.29,990కే అందిస్తున్నట్టు ప్రకటించింది. దీనికి అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్పై మరో 25 వేలు తగ్గిస్తున్నట్టు పేర్కొంది. ఫలితంగా రూ.5,090కే వినియోగదారులు దీనిని సొంతం చేసుకునే అద్భుత అవకాశం లభించింది.

గతేడాది మార్చిలో శాంసంగ్ ఎస్ 7 విడుదలైంది. అప్పట్లో దాని ధర రూ.48,900. ప్రస్తుతం ఈ ఫోన్ను మరో ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా రూ.37,500కే ఆఫర్ చేస్తోంది. ఆగస్టులో ఈ ఫోన్ ధరను శాంసంగ్ తగ్గించి రూ.43,400కే అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం శాంసంగ్ షోరూములలో ఇదే రేటుకు ఈ ఫోన్ అందుబాటులో ఉంది.












Click it and Unblock the Notifications