సెల్ఫీ తీసుకుంటూ గణేషుడు! బాహుబలిగా, పెన్సిల్ లిడ్పై
ముంబై: వినాయక చవితి నేపథ్యంలో గణనాథులు వివిధ రూపాల్లో అలరిస్తున్నారు. ఛత్రపతి శివాజీ, ప్రభాస్ బాహుబలి, మహేష్ బాబు శ్రీమంతుడు తదితర రూపాల్లో గణనాథులు దర్శనం ఇస్తున్నారు. మహారాష్ట్రలోని ముంబైలో సెల్ఫీ గణేష్ కూడా దర్శనమిస్తున్నాడు.
ఇటీవలి కాలంలో సెల్ఫీల జోరు పెరిగిన విషయం తెలిసిందే. యువతనే కాకుండా పెద్దవారు కూడా సెల్ఫీ మోజులో పడ్డారు. ఈ నేపథ్యంలో ముంబైలో సెల్ఫీ గణేష్ కనిపించాడు.
వినాయకుడే సెల్ఫీ తీసుకునే గణేషుడిని ప్రతిష్టిస్తన్నారు. ముంబైలో వినాయకుడి విగ్రహాలు విక్రయించే ఓ దుకాణంలో సెల్ఫీ తీసుకుంటున్న వినాయకుడు కనిపించాడు. తన తల్లిదండ్రులైన శివపార్వతులు, తమ్ముడు కుమార స్వామితో కలిసి సెల్ఫీ తీసుకుంటున్నట్లు తయారు చేసిన ఈ విగ్రహం అందరినీ ఆకర్షిస్తోంది.
ముంబైలో నివసించే కరణ్ తల్వార్ అనే వ్యక్తి ఈ విగ్రహాన్ని ఫొటో తీసి ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త గుల్ పనాగ్ ఈ ఫొటోను రీట్వీట్ చేశారు. దుండీ గణేష సేవా సమితి పెన్సిల్ లిడ్ పైన గణేషుడిని రూపొందించింది. అది అతి చిన్నగా ఉంది.