Shock: తాగుబోతు అని పట్టుకుంటే బ్యాగ్ లో మొత్తం రూ 2 వేల నోట్ల కట్టలు, గోవా బస్సులో గోల్ మాల్ గోవిందం !
బెంగళూరు/ మంగళూరు/ గోవా: కర్ణాటకకు చెందిన కేఎస్ఆర్ టీసీ బస్సు గోవా నుంచి కర్ణాటకలోని శివమొగ్గకు ప్రతిరోజూ తిరుగుతోంది. అంతరాష్ట్ర సర్వీసు బస్సు గోవా నుంచి కర్ణాటకకు బయలుదేరింది. ముందుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఆ బస్సులో ఎక్కారు. గోవా నుంచి అందరూ కర్ణాటకకు బయలుదేరారు. ఇదే బస్సులో కర్ణాటకకు చెందిన నలుగురు వ్యక్తులు ఎక్కారు. నలుగురు వ్యక్తులు అప్పటికే పీకలదాక మద్యం సేవించి బస్సలో ఎక్కారు. బస్సు బయలుదేరిన తరువాత నలుగురు వ్యక్తులు ఏదేదో వాగుతూ ఒకరి మీద ఒకరు కేకలు వేసుకోవడం మొదలు పెట్టారు. బస్సు బయలుదేరి రెండు గంటలు అయిపోయినా వారి నోళ్లకు మాత్రం తాళం పడలేదు, నోటికి విశ్రాంతి ఇవ్వలేదు. బస్సులో సాటి ప్రయాణికులను ఇబ్బంది కలిగించిన ఆ నలుగురు వ్యక్తులు పచ్చి బూతులు మాట్లాడుతూ బస్సు టాప్ లేచిపోయేలా కేకలు వేశారు. బస్సు డ్రైవర్, కండెక్టర్ బస్సు డాబా దగ్గర నిలిపి భోజనం చెయ్యాలని ప్రయాణికులకు చెప్పారు. ఆ సమయంలో బస్సు కండెక్టర్, డ్రైవర్ మీరు బస్సులో సైలెంట్ గా ఉండాలని, సాటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతోందని ఆ నలుగురు వ్యక్తులకు చెప్పారు. ఎవరు ఎన్ని చెప్పినా ఆ నలుగురు మాత్రం ఎవ్వరిమాట వినలేదు. బస్సు బయలుదేరిన తరువాత ఆ నలుగురు ఇంకా రెచ్చిపోయారు. ఇకలాభం లేదని బస్సు డ్రైవర్ నేరుగా బస్సును పోలీస్ స్టేషన్ ముందు నిలిపాడు. పోలీస్ స్టేషన్ బోర్డు చూసిన వెంటనే మద్యం మత్తులో అంతసేపు లేనిపోని గొడవ చేసిన నలుగురు బస్సు దిగి పారిపోయారు. పోలీసులు వెంబడించడంతో ఓ వ్యక్తి చిక్కిపోయాడు. అతని దగ్గర ఉన్న బ్యాగ్ ను గట్టిగా పట్టుకున్నాడు. బ్యాగ్ లో గోవా నుంచి లిక్కర్ తీసుకుని వచ్చిఉంటారని పోలీసులు అనుకున్నారు. అదే సమయంలో తన బ్యాగ్ మాత్రం ముట్టుకోకూడదని అతను కేలు వేశాడు. పోలీసులకు డౌట్ వచ్చి బ్యాగ్ ఓపెన్ చేస్తే రూ. 2,000 నోట్ల కట్టలు బయటపడ్డాయి. రూ. 17. 86 లక్షలకు అతని దగ్గర చిక్కాయి. ఆ డబ్బు అతనిదే అని చెప్పడానికి అతని దగ్గర ఒక్క ఆధారం కూడా లేకపోవడంతో ఆ డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. తాగేసి గొడవ చేస్తున్నాడని పోలీసులు పట్టుకుంటే అతని దగ్గర రూ. 17. 86 లక్షల బయటపడటం హాట్ టాపిక్ అయ్యింది.
Illegal affair: స్నేహితురాలి భర్తతో ఎంజాయ్, ప్రియురాలి కోసం ఎగరేసుకుంటూ వెళ్లాడు, చెక్ పెట్టిన భర్త!
గోవా టూ శివమొగ్గ
కర్ణాటకకు చెందిన కేఎస్ఆర్ టీసీ బస్సు గోవా నుంచి కర్ణాటకలోని శివమొగ్గకు ప్రతిరోజూ తిరుగుతోంది. అంతరాష్ట్ర సర్వీసు బస్సు గోవా నుంచి కర్ణాటకకు బయలుదేరింది. ముందుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఆ బస్సులో ఎక్కారు. గోవా నుంచి అందరూ కర్ణాటకకు బయలుదేరారు. ఇదే బస్సులో కర్ణాటకకు చెందిన నలుగురు వ్యక్తులు ఎక్కారు.
పచ్చి బూతులు మాట్లాడారు
నలుగురు వ్యక్తులు అప్పటికే పీకలదాక మద్యం సేవించి బస్సలో ఎక్కారు. ఉత్తర కన్నడ జిల్లాలోని హళియాళకు చెందిన నాగరాజ నాయక్ కూడా ఆనలుగురిలో ఉన్నాడు. బస్సు బయలుదేరిన తరువాత నలుగురు వ్యక్తులు ఏదేదో వాగుతూ ఒకరి మీద ఒకరు కేకలు వేసుకోవడం మొదలు పెట్టారు. బస్సు బయలుదేరి రెండు గంటలు అయిపోయినా వారి నోళ్లకు మాత్రం తాళం పడలేదు, నోటికి విశ్రాంతి ఇవ్వలేదు.
డ్రైవర్, కండెక్టర్ చెప్పినా మాట వినలేదు
బస్సులో సాటి ప్రయాణికులను ఇబ్బంది కలిగించిన ఆ నలుగురు వ్యక్తులు పచ్చి బూతులు మాట్లాడుతూ బస్సు టాప్ లేచిపోయేలా కేకలు వేశారు. బస్సు డ్రైవర్, కండెక్టర్ బస్సు డాబా దగ్గర నిలిపి భోజనం చెయ్యాలని ప్రయాణికులకు చెప్పారు. ఆ సమయంలో బస్సు కండెక్టర్, డ్రైవర్ మీరు బస్సులో సైలెంట్ గా ఉండాలని, సాటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతోందని ఆ నలుగురు వ్యక్తులకు చెప్పారు.
పోలీస్ స్టేషన్ ముందే ఎస్కేప్
ఎవరు ఎన్ని చెప్పినా ఆ నలుగురు మాత్రం ఎవ్వరిమాట వినలేదు. బస్సు బయలుదేరిన తరువాత ఆ నలుగురు ఇంకా రెచ్చిపోయారు. ఇకలాభం లేదని బస్సు డ్రైవర్ నేరుగా బస్సును ఉత్తర కన్నడ జిల్లాలోని అళ్నావర పోలీస్ స్టేషన్ ముందు నిలిపాడు. పోలీస్ స్టేషన్ బోర్డు చూసిన వెంటనే మద్యం మత్తులో అంతసేపు లేనిపోని గొడవ చేసిన నలుగురు బస్సు దిగి పారిపోయారు.
తాగుబోతు చిక్కిపోయాడు
నాగరాజు చిక్కిపోయాడు
పోలీసులు వెంబడించడంతో నాగరాజు నాయక్ చిక్కిపోయాడు. నాగరాజ్ నాయక్ అతని దగ్గర ఉన్న బ్యాగ్ ను గట్టిగా పట్టుకున్నాడు. బ్యాగ్ లో గోవా నుంచి లిక్కర్ తీసుకుని వచ్చిఉంటారని పోలీసులు అనుకున్నారు. అదే సమయంలో తన బ్యాగ్ మాత్రం ముట్టుకోకూడదని నాగరాజ్ నాయక్ పోలీసుల మీద కేకలు వేశాడు.
రూ. 17 లక్షలకు ఆధారాలు లేవు
పోలీసులకు డౌట్ వచ్చి నాగరాజ్ నాయక్ దగ్గర ఉన్న బ్యాగ్ ఓపెన్ చేస్తే రూ. 2,000 నోట్ల కట్టలు బయటపడ్డాయి. రూ. 17. 86 లక్షలకు నాగరాజ్ నాయక్ దగ్గర చిక్కాయి. ఆ డబ్బు నాగరాజ్ నాయక్ దే అని చెప్పడానికి అతని దగ్గర ఒక్క ఆధారం కూడా లేకపోవడంతో ఆ డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. తాగేసి గొడవ చేస్తున్నాడని పోలీసులు పట్టుకుంటే అతని దగ్గర రూ. 17. 86 లక్షల బయటపడటం హాట్ టాపిక్ అయ్యింది. నాగరాజ్ నాయక్ ఆ డబ్బు తనదే అని చెబుతున్నాడని, అతను బ్యాంకులో డ్రా చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.