ఘోర రైలు ప్రమాదం.... ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకొన్న మహిళ
థానే: ఒక్క క్షణం ఆలస్యమైతే నిండు ప్రాణాలు పోయేవి....రన్నింగ్ లో ఉన్న రైలులో నుండి దూకిన ఓ మహిళ ప్రమాదవశాత్తు అదే రైలు కింద పడబోయింది . ఫ్లాట్ పారం పై ఉన్న ప్రయాణీకులు వెంటనే ఆమెను రక్షించారు. అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది.కాని, చేతులకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి.
మహారాష్ట్ర లోనే థానేలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకొంది.ఓ మహిళ ప్లాట్ పారం నుండి రైలు కింద పడబోయినంది . వెంటనే ప్రయాణీకులు ఆమెను రక్షించారు.బందువుల ఇంటికి వెళ్ళేందుకు ైల్వే స్ఠేషన్ కు వచ్చింది ఓ మహిళ. తాను వెళ్ళాల్సిన రైలు కోసం ఎదురు చూస్తోంది.సమయం గడిచినా రైలు రాలేదు.
మహిళ వెళ్ళాల్సిన రైలు రాలేదు. కాని, అదే సమయానికి మరో రైలు వచ్చింది.దీంతో పొరపాటున ఆమె వేరే ట్రైన్ ఎక్కింది. తాను ఎక్కాల్సిన ట్రైన్ అది కాదని చివరి నిమిషంలో గుర్తించింది. రన్నింగ్ లో ఉన్న ట్రైన్ నుండి ఆమె దూకింది. అయితే ఫ్లాట్ ఫారం నుండి కింద పడి రైలు కింద పడబోయింది ఆమె. వెంటనే ప్లాట్ పారం మీద ఉన్న ప్రయాణీకులు వెంటనే ఆమెను రక్షించారు. ప్రాణపాయం తప్పించుకొంది కాని. చేతికి తీవ్రగాయాలయ్యాయి.
క్షణ: కాలంలో చేసిన పొరపాటుకు ప్రాణం కోల్పోవాల్సి వచ్చింది. రన్నింగ్ లో ఉన్న రైలులో నుండి దిగడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని తెలిసి కూడ జాగ్రత్తలు తీసుకోకపోవడం లేదు. ఆలస్యమైనా సరే క్షేమంగా గమ్యం చేరడం ముఖ్యం. ఆలస్యమౌతోందనే కారణంగా ప్రాణాల మీదికి తెచ్చుకోవడం సరికాదు.