గ్యాంగ్స్టర్స్ను వెంటాడిన పోలీసులు: ఢిల్లీలో కాల్పుల కలకలం..
దేశ రాజధాని న్యూఢిల్లీలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. సౌత్ ఢిల్లీలోని మెట్రోస్టేషన్ వద్ద పోలీసులు, దుండగుల ముఠా మధ్య కాల్పులు చోటు చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. సౌత్ ఢిల్లీలోని మెట్రోస్టేషన్ వద్ద పోలీసులు, దుండగుల ముఠా మధ్య కాల్పులు చోటు చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
కాల్పుల ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. పారిపోతున్న ఓ ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని, మరో వ్యక్తి పారిపోయి సమీపం భవనంలో దాక్కున్నాడని తెలిపారు.

తప్పించుకున్న ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పట్టుబడ్డ నిందితుల నుంచి 12 తుపాకులు, 100 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్స్టర్లను పట్టుకునేందుకు ఢిల్లీ, పంజాబ్ పోలీసులు చేస్తున్న సంయుక్త ఆపరేషన్ లో భాగంగా ఈ కాల్పుల ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications