మృతుల కుటుంబాలకు పరిహారం రూ. 25 లక్షలకు పెంపు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్-2025 టైటిల్ గెలుచుకున్న సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన RCB విజయోత్సవ సంబరాల్లో తీవ్ర విషాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు అభిమానులు వేల సంఖ్యలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్దకు తరలివచ్చారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు. మరికొంతమంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే తొలుత మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. కానీ ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆ పరిహారాన్ని రూ. 25 లక్షలకు పెంచుతూ సీఎం సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ వివరాలను పంచుకున్నారు.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారాన్ని రూ. 25 లక్షలు పెంచుతూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం వీళ్లంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ಚಿನ್ನಸ್ವಾಮಿ ಕ್ರೀಡಾಂಗಣದಲ್ಲಿ ಸಂಭವಿಸಿದ ಕಾಲ್ತುಳಿತ ದುರಂತದಲ್ಲಿ ಮೃತರಾದವರ ಕುಟುಂಬಗಳಿಗೆ ಘೋಷಿಸಿದ್ದ ಪರಿಹಾರವನ್ನು ತಲಾ ರೂ.10 ಲಕ್ಷದಿಂದ 25 ಲಕ್ಷ ರೂ.ಗಳಿಗೆ ಹೆಚ್ಚಿಸುವಂತೆ ಆದೇಶಿಸಿದ್ದೇನೆ.
— Siddaramaiah (@siddaramaiah) June 7, 2025
ತಮ್ಮವರನ್ನು ಕಳೆದುಕೊಂಡು ನೊಂದಿರುವ ಕುಟುಂಬಗಳು ಆರ್ಥಿಕ ಸಮಸ್ಯೆಗಳಿಂದಾಗಿ ಇನ್ನಷ್ಟು ಸಂಕಷ್ಟಕ್ಕೆ ಒಳಗಾಗದಿರಲಿ ಎನ್ನುವುದು ನಮ್ಮ…
మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఇటీవల కీలక ప్రకటన చేసింది. తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అధికారికంగా ఓ పోస్టును సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఈ ఘటన జరగడం దురదృష్టకరం అని ఆర్సీబీ పేర్కొంది. ఈ ఘటనలో గాయపడిన అభిమానులను.. RCB కేర్స్ ఫండ్ ద్వారా ఆదుకుంటామని స్పష్టం చేసింది.
𝗢𝗳𝗳𝗶𝗰𝗶𝗮𝗹 𝗦𝘁𝗮𝘁𝗲𝗺𝗲𝗻𝘁: 𝗥𝗼𝘆𝗮𝗹 𝗖𝗵𝗮𝗹𝗹𝗲𝗻𝗴𝗲𝗿𝘀 𝗕𝗲𝗻𝗴𝗮𝗹𝘂𝗿𝘂
— Royal Challengers Bengaluru (@RCBTweets) June 5, 2025
The unfortunate incident in Bengaluru yesterday has caused a lot of anguish and pain to the RCB family. As a mark of respect and a gesture of solidarity, RCB has announced a financial… pic.twitter.com/C50WID1FEI
ఇక తాజాగా ఈ ఘటనలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందింది. ఈ ఘటనకు ప్రధాన కారణం విరాట్ కోహ్లీ అని రియల్ ఫైటర్స్ ఫోరం అనే సామాజిక సంస్థ అధ్యక్షుడు వెంకటేశ్.. కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కోహ్లీపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెంకటేశ్ పేర్కొన్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications