రెచ్చిపోయిన ఉగ్రవాదులు: కాల్పుల్లో సిక్కు యువకుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్లోని షాల్ కదల్ ప్రాంతంలో పంజాబ్కు చెందిన ఓ కార్మికుడిని కాల్చి చంపారు. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఇతడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు కాశ్మీర్ పోలీసులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్కు చెందిన అమృత్పాల్ సింగ్ను బుధవారం రాత్రి 7 గంటలకు గుర్తుతెలియని ఉగ్రవాదులు కాల్చిచంపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో అమృత్పాల్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో స్థానికేతర కార్మికుడు రోహిత్ (25) అనే వ్యక్తి గాయపడినట్లు చెప్పారు.

ఎస్ఎంహెచ్ఎస్ ఆస్పత్రిలో అతడు చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఉగ్రవాదుల ఆచూకీ కోసం ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఈ ఏడాది కశ్మీర్లో స్థానికేతరులపై ఉగ్రవాదులు దాడి చేయడం ఇదే తొలిసారి. అయితే, గతంలోనూ ఇలాంటి ఘటనలో చాలానే చోటు చేసుకున్నాయి.
గత సంవత్సరం అనంత్నాగ్, షోపియాన్ జిల్లాల్లో స్థానికేతర కార్మికులపై ఉగ్రవాదులు అనేకసార్లు దాడులకు పాల్పడ్డారు. మే 30వ తేదీ అనంత్నాగ్ జిల్లాలో సర్కస్ కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. బీహార్కు చెందిన ఇటుక బట్టి కార్మికుడు ముకేశ్ కుమార్ను అక్టోబర్ 31న పుల్వామా జిల్లాలో కాల్చి చంపారు. జులై 13న షోపియాన్ జిల్లాలోని గాగ్రెన్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు కూలీలు గాయపడ్డారు.
#WATCH | J&K | Terrorists shot dead a non-local, Amritpal Singh at Shaheed Gunj in Srinagar. One more person grievously injured and evacuated for medical attention. Area has been cordoned off.
— ANI (@ANI) February 7, 2024
(Visuals from the area) https://t.co/sqmZ1jW38O pic.twitter.com/gdhKLYqYdu
తాజాగా ఘటనపై స్థానిక రాజకీయ పార్టీల నేతలు విచారం వ్యక్తం చేశారు. స్థానికేతరులపై జరిగిన దాడిని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా ఖండించారు. 'శ్రీనగర్లోని షాల్ కదల్లో కార్మికుడు అమృత్ పాల్ సింగ్ ప్రాణాలను ఉగ్రవాదులు బలిగొన్న అనాగరిక ఘటన తెలిసి ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా దిగ్భ్రాంతికి లోనయ్యారు. వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నారు' అని నేషనల్ కాన్ఫెరెన్స్ పార్టీ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications