వాజ్ పేయి స్థాయి నేత మోదీ : బీజేపీలో చేరిన సింగర్ బక్షి
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న చేరికల పర్వం కొనసాగుతుంది. ఆయా పార్టీల్లో ప్రముఖులు చేరుతున్నారు. కాంగ్రెస్, బీజేపీతోపాటు ప్రాంతీయ పార్టీల్లోనూ చేరికల పర్వం కంటిన్యూ అవుతుంది.
కాషాయ కండువా ..
ప్రముఖ గాయకుడు, సినీ, టీవీ నటుడు అరుణ్ బక్షి బీజేపీలో చేరారు. శనివారం ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రధాని మోదీ చేసే పనులు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. దేశంలో మోదీ స్థాయి నేత మరొకరు లేరని స్పష్టంచేశారు.
వాజ్ పేయి తర్వాత ...
1990లో వాజ్ పేయి సమర్థమంతమైన నాయకుడని .. ఆ తర్వాత మోదీలో అలాంటి లక్షణాలు చూశానని ప్రశంసించారు. మోదీకి మద్దతుగా పలువురు నటులు, కళాకారులు నిలుస్తున్నారని స్పష్టంచేశారు.
నటుడు, గాయకుడు
పంజాబ్లోని లూథియానాలో జన్మించిన బక్షి 100 కు పైగా హిందీ చిత్రాల్లో నటించారు. 298 పాటలు పాడి శ్రోతలను అలరించారు. ‘మహాభారత్' తో సహా పలు టీవీ సీరియల్స్లో, అనేక చిత్రాల్లో కూడా నటించారు.