Sketch: భార్య లేడీ టీచర్, భర్త బేకార్, మేడమ్ వెళ్లి చూస్తే ఇంట్లోనే భర్త దారుణ హత్య, ఏం జరిగింది ? !
చెన్నై/సేలం: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. భర్త ఎలాంటి పని చెయ్యకుండా తండ్రి పెన్షన్ డబ్బుతో కాలం గడుపుతున్నాడు. భార్య స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తోంది. భర్త విలాసాలకు బానిస అయ్యి రూ. 20 లక్షలకు పైగా అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చిన కొందరు అతని పీకలమీద కుర్చుని ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. ఇంటిని ఓ వ్యక్తి దగ్గర తాకట్టుపెట్టి రూ. 20 లక్షలు కావాలని అడిగాడు. ఇప్పటికే రూ. 10 లక్షలు తీసుకున్న అతను కొందరి అప్పు తీర్చాడు. ఉదయం భార్య స్కూల్ కు వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశారు. తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో సాధ్యం కాకపోవడంతో ఇల్లు మొత్తం రక్తపుమరకలు అయ్యాయి. సాయంత్రం ఇంటికి వెళ్లిన లేడీ టీచర్ ఆమె భర్త హత్యకు గురైన విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Illegal affair: ఆంటీ మీద అంకుల్ కు అనుమానం, ఆవేశంతో గొడ్డలితో నరికి చంపేసి !
భార్య లేడీ టీచర్
తమిళనాడులోని సేలం జిల్లాలోని కెంగవల్లి పట్టణంలోని మారియమ్మాన్ కోవిల్ వీదిలో మురుగన్ అలియాస్ సతీష్ (42) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం సతీష్ కుటుంబ సభ్యులు సెట్ చేసిన వనితా (32) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వనితా స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది.
రూ. 20 లక్షలు అప్పులు చేసిన భర్త
వివాహం చేసుకున్న సతీష్, వనితా దంపతులు సంతోషంగా కాపురం చేశారు. వనితా, సతీష్ దంపతులకు 8 సంవత్సరాల వయసు ఉన్న ఓ కొడుకు ఉన్నాడు. సతీష్ ఎలాంటి పని చెయ్యకుండా తండ్రి పెన్షన్ డబ్బుతో కాలం గడుపుతున్నాడు. విలాసాలకు బానిస అయిన సతీష్ తెలిసిన వాళ్ల దగ్గర రూ. 20 లక్షలకు పైగా అప్పులు చేశాడు.
ఇల్లు తాకట్టు పెట్టేశాడు
అప్పులు ఇచ్చిన కొందరు సతీష్ పీకలమీద కుర్చుని ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. ఏం చెయ్యాలో తెలీక సతీష్ అతని సొంత ఇంటిని ఓ వ్యక్తి దగ్గర తాకట్టుపెట్టాడు, ఆగస్టులో రూ. 4 లక్షలు, ఈనెల 11వ తేదీన రూ. 5 లక్షలు అతని దగ్గర సతీష్ తీసుకున్నాడు. మంగళవారం రూ. 2.70 లక్షలు తీసుకున్న సతీష్ ఇంటికి వెళ్లాడు.
భార్య వచ్చి చూస్తే ఇల్లు మొత్తం రక్తపుమరకలు
ఇప్పటికే ఇంటి మీద రూ. 10 లక్షలకు పైగా తీసుకున్న సతీష్ అతను కొందరి అప్పు తీర్చాడు. బుధవారం ఇంటి పత్రాలు అందించి సంతకాలు చేసి మిగిలిన డబ్బులు తీసుకోవలసి ఉంది. మంగళవారం ఉదయం వనితా ఆమె కొడుకుతో పాటు స్కూల్ కు వెళ్లింది. ఇంట్లో సతీష్ మాత్రమే ఉన్నాడు. సాయంత్రం ఇంటికి వెళ్లిన వనితా తలుపులు తీసి చూడగా సతీష్ దారుణ హత్యకు గురైన విషయం గుర్తించి గట్టిగా కేకలు వేసింది.
స్లీపర్ డాగ్స్...... ఎవరు హత్య చేశారు ?
ఇంట్లో ఒంటరిగా ఉన్న సతీష్ ను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఇంట్లో నుంచి సతీష్ తప్పించుకోవడానికి ప్రయత్నించడం, దుండుగులు అడ్డుకోవడంతో సాధ్యం కాకపోవడంతో ఇల్లు మొత్తం రక్తపుమరకలు అయ్యాయి. సాయంత్రం ఇంటికి వెళ్లిన లేడీ టీచర్ వనితా చూసే వరకు సతీష్ హత్యకు గురైన విషయం బయటకు రాలేదు. సాయంత్రం సతీష్ హత్యకు గురైనాడని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సతీష్ హత్యకు కచ్చిత సమాచారం తెలియడం లేదని, అప్పులు ఇచ్చిన వారు హత్య చేశారా ?, మరేమైనా కారణాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.