కాల్పులు: చికిత్స పొందుతూ ఎన్ఐఏ అధికారి భార్య మృతి
న్యూఢిల్లీ: ఎన్ఐఏ అధికారి మొహమ్మద్ తంజిల్ అహ్మద్ భార్య ఫర్జానా అహ్మాద్ (44) చికిత్స పొందుతూ మృతి చెందింది. రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె బుధవారం ఉదయం 11 గంటకు న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో మరణించారు.
ఉత్తరప్రదేశ్లోని బిజ్నూరులో ఈ నెల 4వ తేదీన తంజిల్ అహ్మద్ దంపతులపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల ఘటనలో తంజిల్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్య ఫర్జానా తీవ్ర గాయాలు పాలయ్యారు.
దీంతో ఆమెను హుటాహుటిన న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఈరోజు ఉదయం మృతి చెందారు. తంజీల్ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని పోలీసులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఈ కాల్పుల ఘటనకు సంబంధించి కీలక నిందితులు మాత్రం పరారీలోనే ఉండటం విశేషం. అయితే దుండగులు వ్యక్తిగత కారణాలతోనే ఎన్ఐఏ అధికారి దంపతులపై కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.