సరితా నాయర్ ఆత్మకథ: బాంబులు పేలుస్తుందా?
కోయంబత్తూర్: కేరళ సోలార్ స్కామ్లో ప్రధాన నిందితురాలైన సరితా నాయర్ తాను తన ఆత్మకథ రాస్తానని చెబుతున్నారు. త్వరలోనే దాన్ని విడుదల చేస్తానని చెప్పారు. అప్పటి పాలక పార్టీ నాయకులపై తీవ్రమైన ఆరోపణలు చేసిన సరితా నాయర్ తన ఆత్మకథలో ఏ విధమైన బాంబులు పేలుస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.
తమిళంలో తన జీవిత చరిత్ర రాయాలని కొంత మంది తనను అడిగారని, దాన్ని రాసే పనిలో ఉన్నానని, త్వరలో దాన్ని విడుదల చేస్తానని, తన జీవితంలోని ముఖ్యమైన విషయాలన్నీ అందులో ఉంటాయని ఆమె చెప్పారు. కొద్ది కాలంగా ఆమె కోయంబత్తూరులో ఉంటున్నారు.

సోలార్ స్కామ్ కేసుపై కూడా ఆమె స్పందించారు. కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న న్యాయవిచారణ సంఘానికి 90 శాతం సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించినట్లు ఆమె తెలిపారు. ఈ కేసు విచారణ త్వరితగతిన పూర్తయి, దోషులను శిక్ష పడేలా ప్రస్తుత ఎల్డీఎఫ్ ప్రభుత్వం చూస్తుందనే ఆశాభావాన్ని సరితా నాయర్ వ్యక్తం చేశారు.
తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె చెప్పారు. కోట్లాది రూపాయల మేరకు సరితా నాయర్, బిజూ రాధాకృష్ణన్ మోసం చేశారనేది సోలార్ ప్యానెల్ స్కామ్కు సంబంధించిన ప్రధాన అంశం. ఈ స్కామ్ రాజకీయంగా కూడా తీవ్ర సంచలనం సృష్టించింది.
-
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!!












Click it and Unblock the Notifications