పాక్కు బిగ్ షాక్..ఆర్మీకి భారీగా సైనికులు రాజీనామాలు
పాకిస్తాన్ ఆర్మీలో సైనికులు రాజీనామాలు చేస్తున్నారనే వార్త ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్తో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ పరిణామం మరింత ఆందోళన కలిగిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పెద్ద సంఖ్యలో సైనికులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది.
పాహల్గామ్ దాడిలో 26 మంది పౌరులు మరణించడం, పలువురు గాయపడటంతో సైనికుల్లో భయాందోళనలు నెలకొన్నాయని సమాచారం. భారత్ ప్రతీకార చర్యకు దిగవచ్చనే భయంతో చాలా మంది సైనికులు తమ కుటుంబాల ఒత్తిడి మేరకు రాజీనామాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, సైన్యంలోని అంతర్గత విభేదాలు, నాయకత్వంపై అసంతృప్తి కూడా రాజీనామాలకు కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు. దాదాపు 4500 మంది ఆర్మీ సైనికులతో పాటు, 250 మంది ఆఫీసర్లు సైతం తమ పదవులకు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.

ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సైనికుల మనోధైర్యాన్ని పెంచేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే, పెరుగుతున్న ఉద్రిక్తతలు మరియు ఆర్థిక సంక్షోభం కారణంగా సైనికుల్లో నెలకొన్న భయాందోళనలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఒకవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, మరోవైపు సైనికుల రాజీనామాలతో పాకిస్తాన్ ఆర్మీ సంక్షోభంలో కూరుకుపోయిందనే చెప్పవచ్చు. ఈ పరిణామాలు దేశ భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications