సోనియా బాధ్యతల నుంచి పారిపోరు, రాహుల్ని అలా అన్లేదు: షీలా దీక్షిత్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ నాయకత్వంపై సందేహాలు వస్తున్న కారణంగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీనే నాయకురాలిగా కొనసాగాలని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ అన్నారు. రాహుల్ గాంధీ అసమర్థుడని తాను చెప్పలేదని, అసలు రాహుల్ గురించి తానేం మాట్లాడలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆచూకీపై, నాయకత్వ లక్షణాలపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆమె పైవిధంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పిటిఐతో మాట్లాడిన షీలా దీక్షిత్.. ‘బాధ్యతల నుంచి సోనియా పారిపోరు. ఆమె సవాళ్లను ఎదుర్కొంటారు. కాంగ్రెస్ పార్టీకి ఆమె నాయకత్వంలోనే పునరుజ్జీవం వస్తుంది' అని తెలిపారు. గత కొన్ని రోజులుగా రాహుల్ గాంధీ సెలువుపై వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియదు.

ఆయన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠాన్ని అలంకరిస్తారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా, దీక్షిత్ కొడుకు, కాంగ్రెస్ పార్టీ నేత కాంగ్రెస్ పార్టీలో జరగబోయే ప్రమోషన్ పార్టీకి పెద్దగా లాభం వచ్చే విషయం కాదని తెలిపారు.
ఇది ఇలా ఉండగా, వచ్చే వారం ప్రభుత్వం చేపట్టిన భూ సంస్కరణలకు వ్యతిరకంగా షీలో దీక్షిత్ చేపట్టబోయే ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications