తండ్రి లైవ్ ఇన్ పార్ట్నర్ను చంపిన తనయులు
ఏడాది కాలంగా తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో ఆమె శవం పడి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఇద్దరు సోదరులు మంజు, శివన్న, వారి మిత్రుడు హనుమంత ఆ మహిళను చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సోలాపురి అనే వ్యక్తి కుమారులు మంజు, శివన్నలకు తమ తండ్రి ఆ మహిళతో కలిసి ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయారు.
తమ తండ్రి కన్నా వయస్సులో ఆమె 22 ఏళ్ల చిన్నది. పదేళ్ల క్రితం ఆమెకు ఓ వ్యక్తితో పెళ్లయింది. రెండేళ్ల క్రితం అతనితో ఆమె విడిపోయి సోలాపురి అనే వ్యాపారవేత్తకు దగ్గరయింది. ఆమెకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఏడాదిన్నర కాలంగా సోలాపురి ఆ మహిళ కలిసి ఉంటున్నారు.
తన కుమారులతో ఉంటున్న సోలాపురి ఆమె కోసం వేరే ఇల్లు తీసుకున్నాడు. ఆమె గర్భం దాల్చినట్లు తెసుకున్న అతని కుమారులు తీవ్ర అసంతృప్తికి గరై ఆమెను చంపాలని నిర్ణయించుకున్నారు. మంజు, శివన్న తమ మిత్రుడు హనుమంతతో కలిసి ఆదివారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లి గొంతు నులిమి ఆమెను హత్య చేశారు.