వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తండ్రి లైవ్ ఇన్ పార్ట్నర్‌ను చంపిన తనయులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sons kill father pregnant live-in partner
బెంగళూర్: తండ్రితో సహజీవనం చేస్తున్న 33 ఏళ్ల గర్భిణీ స్త్రీని అతని కుమారులు హత్య చేశారు. కర్ణాటకలోని మైసూరు రోడ్డుపై కంబాలగోడు సమీపంలోని నాగదేవనహళ్లిలో ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతురాలు మునివెంకటమ్మ ఏడు నెలల గర్భవతి.

ఏడాది కాలంగా తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో ఆమె శవం పడి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఇద్దరు సోదరులు మంజు, శివన్న, వారి మిత్రుడు హనుమంత ఆ మహిళను చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సోలాపురి అనే వ్యక్తి కుమారులు మంజు, శివన్నలకు తమ తండ్రి ఆ మహిళతో కలిసి ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయారు.

తమ తండ్రి కన్నా వయస్సులో ఆమె 22 ఏళ్ల చిన్నది. పదేళ్ల క్రితం ఆమెకు ఓ వ్యక్తితో పెళ్లయింది. రెండేళ్ల క్రితం అతనితో ఆమె విడిపోయి సోలాపురి అనే వ్యాపారవేత్తకు దగ్గరయింది. ఆమెకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఏడాదిన్నర కాలంగా సోలాపురి ఆ మహిళ కలిసి ఉంటున్నారు.

తన కుమారులతో ఉంటున్న సోలాపురి ఆమె కోసం వేరే ఇల్లు తీసుకున్నాడు. ఆమె గర్భం దాల్చినట్లు తెసుకున్న అతని కుమారులు తీవ్ర అసంతృప్తికి గరై ఆమెను చంపాలని నిర్ణయించుకున్నారు. మంజు, శివన్న తమ మిత్రుడు హనుమంతతో కలిసి ఆదివారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లి గొంతు నులిమి ఆమెను హత్య చేశారు.

English summary

 A 33-year-old pregnant woman was killed by the sons of her live-in partner in Nagadevanahalli, near Kumbalgodu, off Mysore Road on Sunday night. The killers are absconding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X