లాలూకు షాక్: పార్టీకి 13 మంది ఎమ్మెల్యేల రాజీనామా
పాట్నా: త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జెడి) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు అనుకోని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. ఆర్జెడికి చెందిన 13 మంది శాసనసభ్యులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వీరందరూ కూడా అధికార పార్టీ అయిన జెడియూలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.
బీహార్ అసెంబ్లీలో 22 మంది సభ్యులను కలిగి ఉన్న ఆర్జెడి నుంచి 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 9కి పడిపోయింది. పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు ఆర్జెడి చీఫ్ విప్ రాకేష్ కుమార్ నాయకత్వం వహించారు. ఆయన సామ్రాట్ చౌదరిగా ప్రాచూర్యం పొందారు. రాకేష్ కుమార్ నేతృత్వంలోని రెబెల్ ఎమ్మెల్యేలందరూ తమ రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ ఉదయ్ నరేన్ చౌదరికి సోమవారం మధ్యాహ్నం అందజేశారు.

తామందరం ఆర్జెడి పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించాలని స్పీకర్ను రాకేష్ కుమార్ కోరారు. స్పీకర్ వారి అభ్యర్థనను వెంటనే అంగీకరించినట్లు సమాచారం. రెబల్ ఎమ్మెల్యేల్లో ఐదుగురు ముస్లిం సభ్యులు ఉండగా, ముగ్గురు యాదవ కులానికి చెందిన వారున్నారు. రాజీనామా చేసిన సభ్యులందరూ అధికార పార్టీ అయిన జెడియూ పార్టీలో చేరే అవకాశాలున్నట్లు సమాచారం.
లాలూ ప్రసాద్ యాదవ్ తమను సంప్రదించకుండానే కాంగ్రెస్ పార్టీతో వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటున్నారనే ఆగ్రహంతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మూడు సార్లు ఓడిపోయినా పార్టీకి అండగా నిలిచిన తమను పార్టీ అధినాయకత్వం పట్టించుకోవడం లేదని అసహనంతో వారందరూ పార్టీని వీడినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తమకు తగినన్ని సీట్లు వచ్చే అవకాశం లేదని వారు ఆరోపించినట్లు తెలిసింది.
ఇది ఇలా ఉండగా తాము తమ పార్టీకి రాజీనామా చేయలేదని, తమ సంతకాలను ఎవరో ఫోర్చరీ చేశారని రాజీనామా చేసిన 13 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు చెబుతున్నారు. తాము పార్టీకి రాజీనామా చేయలేదని, పార్టీ వెంటే ఉంటామని వారు స్పష్టం చేశారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications