వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొంతఇలాకాలో చేదు: నితీష్, అఖిలేష్‌లపై చెప్పు, రాళ్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

పాట్నా/లక్నో: బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) ముఖ్యనేత నితీష్ కుమార్‌కు సొంత రాష్ట్రంలో చేదు అనుభవం ఎదురయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నలంద జిల్లాలో పర్యటించారు. ఈ సమయంలో కొందరు ఆయన పైన రాళ్లు, చెప్పులు విసిరేశారు. నితీష్ పాలనలో విద్యుత్, రోడ్లు ఏదీ బాగా లేదని ఆరోపిస్తూ వాళ్లు నితీష్ కుమార్ పైన నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పించలేక పోతోందని నిరసనకారులు విమర్శలు గుప్పించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇంత వరకు ఎవరిని గుర్తించలేదు. అనంతరం కుసుంపురలో మరో వ్యక్తి నితీష్ పైన చెప్పు విసిరారు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, నితీష్ కుమార్ గతంలో నలంద నుండి లోకసభకు ప్రాతినిథ్యం వహించారు. అఖిలేష్ పైన చెప్పు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌పై ఓ యువకుడు చెప్పు విసిరాడు. సోమవారం కావినగర్ సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల సభలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన సభలో అఖిలేష్ యాదవ్ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు ఒక్కసారిగా చెప్పు విసిరాడు. తన భూమిని ప్రభుత్వం అన్యాయంగా స్వాధీనం చేసుకుందని, దీనికి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వమే కారణమని ఆ యువకుడు ఆరోపించాడు. దీంతో పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
పాట్నా/లక్నో: బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) ముఖ్యనేత నితీష్ కుమార్‌కు సొంత రాష్ట్రంలో చేదు అనుభవం ఎదురయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నలంద జిల్లాలో పర్యటించారు. ఈ సమయంలో కొందరు ఆయన పైన రాళ్లు, చెప్పులు విసిరేశారు. నితీష్ పాలనలో విద్యుత్, రోడ్లు ఏదీ బాగా లేదని ఆరోపిస్తూ వాళ్లు నితీష్ కుమార్ పైన నిప్పులు చెరిగారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పించలేక పోతోందని నిరసనకారులు విమర్శలు గుప్పించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇంత వరకు ఎవరిని గుర్తించలేదు. అనంతరం కుసుంపురలో మరో వ్యక్తి నితీష్ పైన చెప్పు విసిరారు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, నితీష్ కుమార్ గతంలో నలంద నుండి లోకసభకు ప్రాతినిథ్యం వహించారు.

అఖిలేష్ పైన చెప్పు

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌పై ఓ యువకుడు చెప్పు విసిరాడు. సోమవారం కావినగర్ సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల సభలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అక్కడ ఏర్పాటు చేసిన సభలో అఖిలేష్ యాదవ్ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు ఒక్కసారిగా చెప్పు విసిరాడు. తన భూమిని ప్రభుత్వం అన్యాయంగా స్వాధీనం చేసుకుందని, దీనికి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వమే కారణమని ఆ యువకుడు ఆరోపించాడు. దీంతో పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

English summary
Protesters today threw stones and chappals at Bihar Chief Minister Nitish Kumar during election rallies in two separate places in Nalanda district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X