ధర్మసంసద్ లో ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు-విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
ఉత్తరాఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా డిసెంబర్లో ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జరిగిన ఓ ధరమ్ సంసద్ సదస్సులో పాల్గొన్న సాధువు యతీ నరసింఘానంద్ తో పాటు పలువురు ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం దీనిపై సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలైంది.
హరిద్వార్ ధరమ్ సంసద్ సదస్సులో ముస్లిం విద్వేష వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇవాళ విచారణకు స్వీకరించింది. ధర్మ్ సంసద్ ద్వేషపూరిత ప్రసంగ అంశం చాలా ప్రమాదకరమని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైనా ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదని, అరెస్టు కూడా చేయలేదని కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

డిసెంబరు 17 నుండి డిసెంబర్ 19 వరకు ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరిగిన మూడు రోజుల ధరం సంసద్ సభలో మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే, మతపరమైన ప్రసంగాలు చేశారు. ఈ సమావేశంలో ప్రసంగించిన పలువురు హిందూ మత పెద్దలు, ఆయుధాలు చేపట్టాలని సమాజానికి పిలుపునిచ్చారు. ముస్లింలకు వ్యతిరేకంగా వారు 'హిందూ దేశం' కోసం స్పష్టమైన పిలుపు ఇచ్చారు.
ఈ సమావేశంలో యతి నర్సింహానంద్ ముస్లింల నుంచి ఎదురయ్యే ముప్పుకి వ్యతిరేకంగా "హిందూ బ్రిగేడ్కు భారీ ఆయుధాల్ని అందించడమే పరిష్కారమని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై స్ధానిక బీజేపీ సర్కార్ కఠినంగా వ్యవహరించలేదని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు త్వరలో విచారణ జరపబోతోంది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications