గల్ఫ్ బాధితులను ఆదుకుంటాం: ఎంపిలకు సుష్మా

గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సాగిన చర్చలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వి.కె.సింగ్తోపాటు కార్యదర్శి ప్రేమ్ నారాయణ్ కూడా పాల్గొన్నారు. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), వైయస్సార్ కాంగ్రెసు లోక్సభ సభ్యులతోపాటు కాంగ్రెస్కు చెందిన రాజ్యసభ సభ్యులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు.
నైపుణ్యం గల కార్మికులు అధికారిక వీసాలపై గల్ఫ్ దేశాలకు వెళ్లి బాగా సంపాదిస్తుండటంతో నైపుణ్యం లేని వారు కూడా ఆశపడి, ఏజెంట్ల మోసాలకు బలవుతున్నారని వారు మంత్రికి వివరించారు. ఈ దుస్థితిని నివారించేందుకు విదేశాంగ శాఖతోపాటు కార్మిక శాఖలు సంయుక్తంగా ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.
కేరళ మినహా గల్ఫ్లో ఇబ్బందులు పడుతున్నవారిలో అత్యధికులు తెలుగువారేనని, 1.04 లక్షల మంది తెలుగు కార్మికులు గల్ఫ్లో ఉన్నారని తెలిపారు. వీరిలో టెన్త్, ఆలోపు చదివినవారు 74 శాతం కాగా, నిరక్షరాస్యులు 24 శాతమని వివరించారు. తెలుగు కార్మికులలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు 90 శాతంగా ఉన్నట్లు చెప్పారు. వీరిని ఆదుకునేందుకు కేంద్రం రూ.2 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని అంశాలపైనా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తామని సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారు. అలాగే గల్ఫ్కు ప్రతినిధి బృందాన్ని పంపడాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications