కర్ణాటక కుంటిసాకులు, అందుకే మోదీకి చెప్పాము, అసెంబ్లీలో సీఎం సంచలన నిర్ణయం!
చెన్నై/బెంగళూరు: తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 9వ తేదీన సోమవారం (ఈరోజు) ప్రారంభం అయ్యాయి. తమిళనాడు అసెంబ్లీలో ఈరోజు వివిధ తీర్మానాలు ప్రవేశపెట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం ఎంకే స్టాలిన్ తో (stalin) పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ నేపథ్యంలో కావేరి (cauvery) జలాల సమస్యపై తమిళనాడు (tamil nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టారు.
ఆ సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (stalin) మాట్లాడుతూ తమిళనాడు వ్యవసాయానికి పునాది అయిన కావేరి (cauvery)డెల్టా సాగునీటి రైతుల జీవనోపాధిని కాపాడాలని, అందుకు తమిళనాడులోని (tamil nadu) అందరూ సహకరించాలని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమిళనాడుకు నీరు విడుదల చేసేలా కర్ణాటక ( karnataka) ప్రభుత్వాన్ని ఆదేశించాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు.

అంతకుముందు మాట్లాడిన తమిళనాడు (tamil nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (stalin) కర్ణాటక కావేరి జలాల విషయంలో కృత్రిమ సంక్షోభాన్ని సృష్టిస్తోందని, కర్ణాటక ( karnataka)సరిపడా నీళ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. మొత్తం 9.19 టీఎంసీలకు బదులు 2.28 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందని, ఈ విషయంలో మాకు న్యాయం చెయ్యాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిశామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు.
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కావేరి (cauvery) జలాల పంపిణి విషయంలో జోక్యం చేసుకోవాలని కోరామని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (stalin) తెలిపారు. రైతుల పంట సాగుకు నష్టం జరగకుండా చూడాలని, సుప్రీంకోర్టు ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం పాటించడం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. గత 30 ఏళ్లలో సగటున కర్ణాటక ( karnataka)డ్యామ్లలో 84 శాతం నీరు ఉందని స్టాలిన్ అన్నారు.

కావేరి (cauvery) నీటి కొరతపై తాను ప్రధాని నరేంద్ర మోదీకి (Modi) లేఖ రాశానని, కావేరీ మేనేజ్మెంట్ అథారిటీ సమావేశంలో నీటి విడుదలను 10,000 క్యూబిక్ అడుగులకు తగ్గించాలని చెప్పడంతో తమిళనాడు అధికారులు వాకౌట్ చేశారని తమిళనాడు (tamil nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (stalin) ఇదే సందర్బంలో ప్రస్తావించారు. తమిళనాడు ప్రజల ఆహార అవసరాలకే కాదు, మానవుల మనుగడకు కావేరీ జలాలు అవసరమని ఎంకే స్టాలిన్ చెప్పారు.

తమిళనాడు ప్రజలకు కావేరీ (cauvery) జలాలను అందించే విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడమని, కర్ణాటక (karnataka)మనకు ఇవ్వాల్సిన నీరు వదిలేవరకు వదిలిపెట్టబోమన్నారు. కావేరి ఇష్యూలో కేంద్ర ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించి తమిళనాడు ప్రజలకు కావేరీ జలాలను అందించాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (stalin) కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశారు. తమిళనాడుకు రావాల్సిన కావేరి జలాలు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలని తమిళనాడు (tamil nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (stalin) డిమాండ్ చేశారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications