రాజ్ భవన్పై పెట్రోల్ బాంబు దాడి: నిందితుడి అరెస్ట్
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని రాజ్ భవన్పై పెట్రోల్ దాడి జరగడం కలకలం రేపింది. గిండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గవర్నర్ నివాసం మెయిన్ గేట్పై వినోద్ అనే వ్యక్తి పెట్రోల్ బాంబుతో దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే స్పందించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు.
రాజ్భవన్పై పెట్రోల్ బాంబు విసిరేయడం వెనుక ఉన్న ఉద్దేశం తెలుసుకునేందుకు అధికారులు నిందితుడ్ని విచారిస్తున్నారు. అయితే, పెట్రోల్ బాంబు దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని, నిందితుడు కేవలం ఒక పెట్రోల్ బాంబు మత్రమే ఉపయోగించాడని పోలీసులు తెలిపారు.

'బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రాజ్భవన్ వెలుపల బారికేడ్ల దగ్గర ఓ గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ బాంబులను విసిరేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది గమనించి.. వెంటనే అతడిని చుట్టుముట్టారు. అనంతరం అతడి చేతిలో ఇతర పెట్రోల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిందితుడిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు లేవు. నిందితుడు మద్యం తాగి ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్ భవన్ వద్ద సరైన బందోబస్త్ ఉంది. నిందితుడిని హిస్టరీ-షీటర్ కె వినోద్గా గుర్తించాం. అతడు ఓ నేరస్థుడు.. అతడిపై ఇప్పటికే 6 నుంచి 7 కేసులు ఉన్నాయి. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతోంది' అని చెన్నై అడిషనల్ పోలీస్ కమిషనర్ ప్రేమ్ ఆనంద్ సిన్హా తెలిపారు.
మూడు రోజుల క్రితం జైలు నుంచి బయటకు రావడానికి గవర్నర్ అనుమతి ఇవ్వలేదన్న కోపంతో కక్ష పెంచుకున్న నిందితుడు.. ఈ దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఈ ఘటన తమిళనాడులో శాంతి భద్రతల పరిస్థితిపై ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ.. తమిళనాడు సర్కారుపై మండిపడింది. రాష్ట్రంలో ప్రస్తుత శాంతి భద్రతల పరిస్థితిని ఈ దాడి ప్రతిబింబిస్తుందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నమలై.
#WATCH | Chennai, Tamil Nadu: Prem Anand Sinha, Additional Commissioner of Police says, "Around 3 pm, an unidentified person tried to throw some bottles of petrol outside Raj Bhavan near barricades. As soon as this was noticed by the security personnel present there, they… https://t.co/KxgoIOVljc pic.twitter.com/WlqJsxLCoz
— ANI (@ANI) October 25, 2023
ఇది ఇలావుండగా, తమిళనాడులో గతేడాది ఫిబ్రవరిలో ఇలాంటి ఘటనే జరిగింది. బీజేపీ ప్రధాన కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ బాంబు విసిరేశారు. ఈ దాడికి పాల్పడిన నేరస్థున్ని తప్పకుండా శిక్షించాలని.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరవయ్యాయని ఆ సమయంలో ఆరోపించారు అన్నమలై.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications