పోలీసుల అదుపులో తేజ్పాల్: రేపటి వరకు బెయిల్
పానాజీ: మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి కేసులో నిందితుడైన తెహెల్కా మాజీ సంపాదకుడు తరుణ్ తేజ్పాల్ శుక్రవారం సాయంత్రం గోవాకు చేరుకున్నారు. ఇక్కడికి చేరుకున్న వెంటనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం పోలీసులు తరుణ్ తేజ్పాల్ను అరెస్టు చేసే అవకాశం ఉంది. పోలీసుల విచారణకు హాజరు కావడానికే తాను గోవా వచ్చినట్లు తరుణ్ తేజ్పాల్ చెప్పారు. తేజ్పాల్కు మరింత ఊరట లభించింది. కోర్టు ఆయనకు రేపు శనివారం ఉదయం పది గంటల వరకు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది.
అంతకు ముందు - తరుణ్ తేజ్పాల్ ఢిల్లీ విమానాశ్రయంలో దర్శనమిచ్చాడు. ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఆయన నివాసానికి గోవా పోలీసులు శుక్రవారం ఉదయమే చేరుకున్నారు. అయితే, ఆయన జా కనిపించలేదు. ఆయన ఎక్కడున్నారనే విషయం చెప్పడానికి తరుణ్ తేజ్పాల్ భార్య గీతన్ బాత్రా నిరాకరించారు.

ఆయనకు పానాజీ కోర్టు శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన అరెస్టుకు బ్రేక్ పడింది. ఇండిగో విమానంలో ఆయన గోవాకు చేరుకున్నారు. అరెస్టు నుంచి తరుణ్ తేజ్పాల్ తప్పించుకోలేరని అంటున్నారు.
లైంగిక దాడికి సంబంధించిన ఆరోపణలు వచ్చిన తర్వాత తేజ్పాల్ మొదటి సారి బయటి ప్రపంచానికి కనిపించారు. తనకు సమన్లు అందాయని, తాను గోవాకు వెళ్తున్నానని ఆయన చెప్పారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications