విమాన ప్రమాదంపై టాటా గ్రూప్ కీలక ప్రకటన.. ఎయిరిండియా ఛైర్మన్ ఏం చెప్పారంటే?
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలడం తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో దాదాపు 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇంతలో ఎయిరిండియాను నిర్వహిస్తున్న టాటా గ్రూప్ ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేసింది. ఎయిరిండియా ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు.
అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్కు వెళ్తున్న ఎయిరిండియా విమానం 171 ఈ రోజు విషాదకరమైన ప్రమాదానికి గురైందని తెలియజేయడానికి నేను చాలా విచారంగా ఉన్నామని టాటా గ్రూప్ ప్రకటన విడుదల చేసింది. ఈ భయంకరమైన ఘటనతో ప్రభావితమైన కుటుంబాలకు, తమ ప్రియమైన వారిని కోల్పోయిన ప్రజలకు సంతాపం తెలియజేస్తున్నామని ప్రకటించింది.

With profound sorrow I confirm that Air India Flight 171 operating Ahmedabad London Gatwick was involved in a tragic accident today. Our thoughts and deepest condolences are with the families and loved ones of all those affected by this devastating event.
— Tata Group (@TataCompanies) June 12, 2025
At this moment, our…
కంపెనీ ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టు ప్రకారం ఎయిరిండియా ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఇలా అన్నారు. "బాధిత ప్రజలకు, వారి కుటుంబాలకు సహాయం చేయడమే మా మొదటి ప్రాధాన్యత. మేము ఘటనా స్థలంలో ఉన్న అత్యవసర బృందాలకు సాధ్యమైనంత వరకు సాయం చేస్తున్నాం. బాధిత ప్రజలకు అవసరమైన సహాయం, సంరక్షణ అందించడానికి కూడా మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. మాకు మరింత ఖచ్చితమైన సమాచారం అందిన వెంటనే మేము మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాం. కుటుంబాలకు సమాచారం అందించడానికి అత్యవసర కేంద్రం ప్రారంభించబడింది. అలాగే ఒక సహాయక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ బృందం కుటుంబాలకు సహాయం చేస్తుంది. ఈ క్లిష్ట సమయంలో ఎయిరిండియా అందరికీ తోడుగా ఉంది. మేము అన్ని విధాలుగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం." అని ప్రకటించారు.
Air India confirms that flight AI171, from Ahmedabad to London Gatwick, was involved in an accident today after take-off.
— Air India (@airindia) June 12, 2025
The flight, which departed from Ahmedabad at 1338 hrs, was carrying 242 passengers and crew members on board the Boeing 787-8 aircraft. Of these, 169 are…
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications