ట్రిపుల్ తలాక్పై సుప్రిం కోర్టుకు వెళతాం... ముస్లిం లా బోర్డు
ట్రిపుల్ తలాక్ బిల్లుకు పార్లమెంటు ఆమోదంపై ఆల్ ఇండియా ముస్లిం పెర్సనల్ లా బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపిన కొద్ది సేపటికే బోర్డు స్పందించింది. తాజా పరిణామాల నేపథ్యంలో 'న్యాయం' కోసం తాము సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది.

కాగా ముస్లిం కుటుంబాలను విడగొట్టటమే బిల్లు ముఖ్య ఉద్దేశమని లా బోర్డు అభిప్రాయ పడింది. స్వభావరీత్యా ఇది నిరంకుశ బిల్లు అని, ముస్లిం మగవాళ్లను లక్ష్యంగా చేసుకున్నదని ఎఐఎండబ్ల్యూపీఎల్బీ గతంలోనూ తీవ్రంగా వ్యతిరేకించింది. కాగా, లోక్సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభలోనూ ఇవాళ సాయంత్రం ఆమోద ముద్ర పడింది. బిల్లుకు అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 84 ఓట్లు పడ్డాయి. ఉభయసభల్లోనూ ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయగానే చట్టం రూపు సంతరించుకుంటుంది.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications