Madhya pradesh election 2023: ఓటు వేస్తే పోహా, జిలేబీ ఉచితం..
సాధారణంగా ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు హామీలు, ఆఫర్లు ఇస్తుంటాయి. కానీ మధ్యప్రదేశ్ లో దుకాణదారుల సంఘం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఓటు వేసిన వారికి ఉచితంగా పోహా, జిలేబీ అందిస్తామని ఇండోర్ లోని ఒక దుకాణదారుల సంఘం ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ ముందుగా ఓటు వేసిన వారికి మాత్రమేనని స్పష్టం చేసింది. ఇండోర్లో పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్లోని 230 స్థానాలకు నవంబర్ 17న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇండోర్లోని ఫుడ్ హబ్ '56 డుకాన్' ఆవరణలో ఉన్న షాపుల యజమానులు ఈ వినూత్న ఆఫర్ను ప్రకటించారు. ముందుగా ఓటు వేసి వేలికి సిరా చూపించిన వారికి ఉచితంగా పోహా, జిలేబీ అందజేస్తామని వివరించారు. ఈ ఆఫర్ పోలింగ్ రోజు ఉదయం 9 గంటల వరకు వర్తిస్తుందని యజమానుల సంఘం స్పష్టం చేసింది.

ఓటింగ్ శాతాన్ని పెంచేందుకే ఈ ఆఫర్ ప్రకటించినట్లు 56 డుకాన్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుంజన్ శర్మ తెలిపారు. పరిశుభ్రతలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న ఇండోర్ ను ఓటింగ్ శాతంలోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.ఓటింగ్ రోజు నిర్దేశిత సమయం తర్వాత ఓటు వేసే వారికి 10 శాతం రాయితీ లభిస్తుందని తెలిపారు. ఇండోర్ అర్బన్లో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉండగా, 2018లో 14.72 లక్షల మంది ఓటర్లలో 67 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి 15.55 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
నవంబర్ లో మధ్యప్రదేశ్ తో పాటు రాజస్థాన్, చత్తీస్ గఢ్, మిజోరాం, తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. మధ్యప్రదేశ్ లో ఆఫర్ పెట్టినట్లుగానే తెలంగాణలో కూడా అలాంటి ఆఫర్ పెడితే బాగుంటుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications