మహారాజుల ఫ్యామిలీ కోసం ప్రధాని మోదీ ఏం చేశారంటే ?, రంగంలోకి అమిత్ షా, సీక్రేట్ సర్వే !
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్ణాటక రాష్ట్రంలో ఆశ్చర్యకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయగా, రెండో జాబితా నేడు విడుదలయ్యే అవకాశం ఉంది. అటు పార్టీ నేతలు, ఇటు సామాన్య కార్యకర్తలకు కూడా టికెట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతున్నందున కొందరు సిట్టింగ్ ఎంపీలకు కూడా టికెట్లు దక్కకుండా పోయే అవకాశం ఉంది.
బీజేపీ రెండో జాబితా విడుదల కాకముందే ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. ప్రజలకు అనుకూలంగా ఎన్నో పనులు చేస్తూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహాకు ఈసారి టిక్కెట్టు దక్కే అవకాశం ఉందని సమాచారం. దానికి బదులు మైసూర్ రాజ వంశస్థుడైన యదువీర్ వడయార్ కు బీజేపీ టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మైసూరు-కొడగు లోక్సభ టికెట్ ప్రతాప్ సింహాకు లేదా యదువీర్ వడయార్ లో ఎవరికి దక్కుతుందనే లెక్కల మధ్యలో బీజేపీ నాయకుల్లో గందరగోళం నెలకొంది. ఇలాంటి సమయంలో మరో వ్యక్తి పేరు తెరమీదకు రావడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం ఇప్పుడు బయటకు వచ్చింది. మైసూరు బీజేపీ అభ్యర్థి ఎంపిక కోసం బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోందని వెలుగు చూసింది
సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహా, యదువీర్ వడయార్ లను పక్కనబెట్టి మరో అభ్యర్థిపై మూడు రోజుల క్రితం కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా సర్వే నిర్వహించి నివేదిక తెప్పించుకున్నారని వెలుగు చూసింది. ఈ విషయాన్ని కొందరు బీజేపీ నాయకులు అవును అని అంటున్నారు. ఒక్కలిగ సామాజికవర్గం, ఆర్ఎస్ఎస్కు విధేయుడైన అభ్యర్థి ఎవరనే విషయమై సర్వే నిర్వహించి నివేదికను సిద్ధం చేసిన బీజేపీ హైకమాండ్ ఆ నివేదికను ముగ్గురి పేర్లతో కలిపి ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించినట్లు సమాచారం.

అంతకుముందు బీజేపీ హైకమాండ్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహాతో పాటు మడికేరి మాజీ ఎమ్మెల్యే అప్పచ్చు రంజన్, మైసూరు బీజేపీ సీనియర్ నేత సీహెచ్. విజయ శంకర్ పై సర్వే కూడా జరిపించిందని, బీజేపీ సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహాకు అనుకూలంగా అధిక శాతం మంది ప్రజలు మొగ్గు చూపించారని వెలుగు చూసింది. బీజేపీ హైకమాండ్ సర్వే చాలా సీక్రేట్ గా జరిగిందని సమాచారం.
బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మైసూర్ లోక్ సభ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు. అంతేకాకుండా ప్రతాప్ సింహా గత 10 సంవత్సరాలల్లో ఎంపీ హోదాలో అనేక అభివృద్ధి పనులు చేశారని నియోజకవర్గంలోని ప్రజలు అభిప్రాయపడుతున్నారని వెలుగు చూసింది. దీంతో ప్రతాప్ సింహాకు మరోసారి బీజేపీ ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని ప్రజలు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారని కన్నడ మీడియా అంటోంది.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications