ఆస్తి కోసం భార్యను ఏం చేశాడంటే ?, అత్త ఆస్తులు ఉద్దరగా వస్తున్నాయని ?
బెంగళూరు/మైసూరు: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు. తమ కుమార్తె సంతోషంగా ఉండాలని ఆమె అడిగినంత డబ్బులు, బంగారు ఇచ్చిన కుటుంబ సభ్యులు ఆమె సంతోషంగా ఉంటే అదేచాలు అని అనుకున్నారు. అయితే కట్టుకున్న భర్త చేతిలోనే ఆమె హత్యకు గురి కావడం కలకలం రేపింది. కోట్లాదిరూపాయల విలువైన ఆస్తుల కోసం, అక్రమ సంబందం విషయంలో భార్యను హత్య చేసిన భర్త జల్సా చెయ్యడానికి ప్లాన్ చేశాడు.
కర్ణాటకలోని మైసూరులోని హెబ్బాళ లేఔట్ లోని షణ్ముగస్వామి, రాజేశ్వరి దంపతులు నివాసం ఉంటున్నారు. షణ్ముగస్వామి, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. షణ్ముగస్వామి కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. షణ్ముగస్వామి ఆయన కుమార్తె శృతి (32) బాగా చదువుకుంది. శృతి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. శృతి సోదరికూడా చాలా అందంగా ఉంటుంది.

2013లో మండ్యలోని వీవీ నగర్ కు చెందిన సోమశేఖర్ అనే వ్యక్తితో శృతి వివాహం జరిగింది. శృతి తల్లిదండ్రులకు కోట్లాదిరూపాయల ఆస్తులు ఉన్నాయి. శృతి, సోమేశేఖర్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత కూడా సోమశేఖర్ అతని భార్య శృతితో కలిసి ఆమె పుట్టింటికి, బంధువుల ఇంటికి కారులో హ్యాపీగా తిరుగుతూ సంతోషంగా ఉండేవాడు.
మైసూరు నగరంలో షణ్ముగస్వామి, రాజేశ్వరి నాలుగు అంతస్తుల భవనం నిర్మించారు. తరువాత కుమార్తె శృతిని వారితోనే ఉండాలని చెప్పారు. కొన్ని నెలల తరువాత శృతి , సోమేశేఖర్ అదే ఇంటికి వచ్చి మూడో అంతస్తులో కాపురం ఉంటున్నారు. కొంతకాలం పాటు అందరూ హ్యాపీగానే ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం వరుసగా ఆరు నెలల వ్యవధిలో షణ్ముగస్వామి, రాజేశ్వరి చనిపోయారు.
ఇదే సందర్బంలో శృతి సోదరి కుటుంబ సభ్యులు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మైసూరు సిటీలోని కోట్లాది రూపాయల విలువైన భవనంతో పాటు కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు అన్ని శృతి పేరు మీద రిజిస్టర్ అయ్యాయి. భార్య పేరు మీద ఉన్న ఆస్తులు మొత్తం తన పేరు మీద రిజిస్టర్ చేసుకోవాలని సోమశేఖర్ ప్లాన్ చేశాడు. అయితే ఆస్తులు భర్త పేరుతో రాసివ్వడానికి శృతి అంగీకరించలేదు.
తన పిల్లల పేరుతో ఆస్తులు రాసిస్తానని, నీ పేరు మీదమాత్రం రాసివ్వనని శృతి ఆమె భర్తకు చెప్పింది. ఇదే విషయంలో పదేపదే దంపతుల మధ్య గొడవపడ్డారు. రాత్రి పిల్లలకు భోజనం తినిపించిన తరువాత నిద్రపోతున్న శృతి గొంతు నులిమి హత్య చేసిన సోమశేఖర్ తన భార్య నిద్రలోనే చనిపోయిందని అందరికి ఫోన్ చేసి చెప్పాడు. పోలీసుల దర్యాప్తులో, పోస్టుమార్టం రిపోర్టులో శృతి హత్యకు గురైయ్యిందని వెలుగు చూడంటంతో ఆమె భర్త సోమశేఖర్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications