ప్రియుడి తల్లిని నగ్నంగా ఊరేగించిన కేసులో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, ఏం తమాషా చేస్తున్నారా?
కర్ణాటక -మహారాష్ట్ర సరిహద్దు జిల్లా అయిన బెళగావిని కుందానగరి అని పిలుస్తారు. అలాంటి బెళగావి జిల్లాలోని ఒక గ్రామంలో మొత్తం మానవ జాతిని దిగ్భ్రాంతికి గురిచేసే సంఘటన జరిగింది. మహిళపై కొందరు దుండగులు దాడికి పాల్పడి ఆమెను నగ్నంగా చేసి ఊరు మొత్తం ఊరేగించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ చర్యకు పాల్పడిన వారికి కర్ణాటక హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది.
బెళగావి జిల్లాలోని ఓ గ్రామంలో మహిళను వివస్త్రను చేసి ఊరేగించిన ఘటనపై కర్ణాటక హైకోర్టు మండిపడింది. అలాగే ఈ కేసును కర్ణాటక హైకోర్టు సీరియస్గా పరిగణించింది. ఈ కేసు సర్వసాధారమైన కేసు కాదని కర్ణాటక హైకోర్టు చెప్పింది. నిందితులను చేతుల్లో అసాధారణ చికిత్స అందుతుందని నిందితులను కర్ణాటక హైకోర్టు హెచ్చరించింది. కర్ణాటక హైకోర్టు సీరియస్ కావడంతో బెళగావి జిల్లాలోని గ్రామంలో మహిళలను అవమానించిన నిందితులకు కఠిన శిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు.

డిసెంబర్ 11వ తేదీన నిశ్చితార్థం జరగనున్న అమ్మాయితో బాధితురాలి కుమారుడు పారిపోయాడు. ప్రేమలో ఉన్నందున ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారని వెలుగు చూసింది. ఈ కారణంగా ప్రియురాలితో పారిపోయిన ప్రియుడి తల్లి దాడి చేసి అమాయకురాలు అయిన ఆ మహిళను నగ్నంగా చేసి ఊరు మొత్తం ఊరేరగించారని ఆరోపణలు ఉన్నాయి. తనను విద్యుత్ స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురిచేశారని బాధితురాలు ఆరోపణలు చేశారు.
ఈ సంఘటను కర్ణాటక హైకోర్టు సుమోటో కేసుగా స్వీకరించింది. కర్ణాటక హైకోర్టు బెళగావి జిల్లా పోలీసు అధికారులకు నోటీసులు ఇచ్చింది. డిసెంబర్ 18వ తేదీన కోర్టు ముందు హాజరు కావాలని బెళగావి సిటీ పోలీసు కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP)కి కర్ణాటక హైకోర్టు సమన్లు జారీ చేసింది. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివిజన్ బెంచ్ ముందు అడ్వకేట్ జనరల్ ఈ సంఘటనపై వివరణ ఇచ్చారు. ఘటనకు సంబంధించి తీసుకున్న చర్యల గురించి పత్రాన్ని సమర్పించారు.
అయితే ఈ నివేదికపై హైకోర్టు డివిజన్ బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ పూర్తి సమాచారం ఉన్న నివేదికను సమర్పించాలని సూచించింది. ఈ ఘటన తర్వాత జరిగిన దర్యాప్తుపై మాకు సంతృప్తి లేదని హైకోర్టు చెప్పింది. అదనపు నివేదికను దాఖలు చేయడానికి ఏజీ సమయం కోరారు. ఈ నేపథ్యంలో సోమవారం అదనపు నివేదికను దాఖలు చేయాలని కర్ణాటక హైకోర్టు సూచించింది. మహిళపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కర్ణాటక హైకోర్టు బెళగావి జిల్లా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications