వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం - కేంద్ర ప్రభుత్వం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఎయిర్ ఇండియా

ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణపై మీడియాలో ప్రచురితమైన వార్తల్లో నిజం లేదని ప్రభుత్వం చెప్పింది.

దేశంలోని ఒక పెద్ద పారిశ్రామిక గ్రూప్‌కు ఎయిర్ ఇండియా నియంత్రణను అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందంటూ కొన్ని వర్గాల ద్వారా తమకు సమాచారం అందిందని చాలా మీడియా వెబ్‌సైట్లు రాశాయి.

"అధికారుల ఒక ప్యానల్ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసే కంపెనీని ఎంపిక చేసింది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే మంత్రి మండలి దీనికి ఆమోద ముద్ర వేయడమే మిగిలింది" అని కొన్ని మీడియా వెబ్ సైట్లలో వార్తలు వచ్చాయి.

కానీ, ప్రభుత్వం ఈ వార్తపై వివరణ ఇచ్చింది. ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ సెక్రటరీ దీనిపై ఒక ట్వీట్ చేశారు.

"ఎయిర్ ఇండియా ఫైనాన్షియల్ బిడ్‌కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అవి తప్పు. ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకున్నప్పుడు మీడియాకు సమాచారం అందిస్తాం" అన్నారు.

https://twitter.com/SecyDIPAM/status/1443844070757986305?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
The media reports on the withdrawal of Air India investment are untrue - the Central Government
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X