ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం - కేంద్ర ప్రభుత్వం
ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణపై మీడియాలో ప్రచురితమైన వార్తల్లో నిజం లేదని ప్రభుత్వం చెప్పింది.
దేశంలోని ఒక పెద్ద పారిశ్రామిక గ్రూప్కు ఎయిర్ ఇండియా నియంత్రణను అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందంటూ కొన్ని వర్గాల ద్వారా తమకు సమాచారం అందిందని చాలా మీడియా వెబ్సైట్లు రాశాయి.
"అధికారుల ఒక ప్యానల్ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసే కంపెనీని ఎంపిక చేసింది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే మంత్రి మండలి దీనికి ఆమోద ముద్ర వేయడమే మిగిలింది" అని కొన్ని మీడియా వెబ్ సైట్లలో వార్తలు వచ్చాయి.
కానీ, ప్రభుత్వం ఈ వార్తపై వివరణ ఇచ్చింది. ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ సెక్రటరీ దీనిపై ఒక ట్వీట్ చేశారు.
"ఎయిర్ ఇండియా ఫైనాన్షియల్ బిడ్కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అవి తప్పు. ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకున్నప్పుడు మీడియాకు సమాచారం అందిస్తాం" అన్నారు.
https://twitter.com/SecyDIPAM/status/1443844070757986305?
ఇవి కూడా చదవండి:
- బ్రేక్ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా? మనం రోజూ తినే ఆహారంలో అదే ముఖ్యమైనదా?
- మోదీ తీసుకొస్తున్న 'బలవర్ధక బియ్యం’ ఏంటి? హైదరాబాద్లో తయారైన ఈ కొత్త రకం వరి అన్నం తింటే దేశ ప్రజల ఆరోగ్యం మెరుగవుతుందా?
- అమ్మోనియం నైట్రేట్ అంటే ఏమిటి.. అది ఎంత ప్రమాదకరం
- అమెరికా సీఐఏ గూఢచారులను రష్యా 'రహస్య మైక్రోవేవ్ ఆయుధాల’తో చంపాలని చూస్తోందా?
- వెదురు చిగురు.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా టాప్ ట్రెండ్లో ఉన్న వంటకం ఇదే
- ఆంధ్రప్రదేశ్: స్కూల్ పేరెంట్స్ కమిటీ ఎన్నికలు తలలు పగలగొట్టుకునే వరకు ఎందుకెళ్లాయి?
- 'చైనా ఫోన్లు కొనకండి, మీ దగ్గరున్నవి వీలైనంత త్వరగా పడేయండి’
- సీతాఫలంపై చైనా, తైవాన్ మధ్య వివాదం ఎందుకు?
- అన్నం ఎక్కువగా తింటే ముందుగానే మెనోపాజ్..!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)