Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముళ్లును ముళ్లుతోనే తియ్యాలి, బీరును బీరుతోనే కొట్టిన మందుబాబులు, సీఎంకు షాక్ !

ముళ్లును ముళ్లుతోనే తియ్యాలని పెద్దలు ఓ సామెత చెప్పారు. ఇప్పుడు అదే సామెతను మందు మరోసారి గుర్తు చేశారు. ఆ సామెతను కొంచెం మార్చి ఆ సామెతను నిజం చేశారు. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి లిక్కర్ ధరలు సర్వసాధారణంగా పెంచడం జరుగుతుంది. అయితే మందు బాబుల దెబ్బకు లిక్కర్ కంపెనీలతో పాటు ప్రభుత్వం వేసిన స్కెచ్ రివర్స్ అవుతోందని స్పష్టంగా వెలుగు చూసింది.

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి ప్రారంభం నుంచి బీరు ధరలను పెంచడంతో బీర్ ప్రియులు రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. అధిక ధరల బీర్లకు డిమాండ్ పడిపోయింది. సిద్దరామయ్య ప్రభుత్వం బీరుపై అదనపు సుంకాన్ని 10 శాతం పెంచింది. ఈ కొత్త రేటు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కర్ణాటకలో అమలులోకి వచ్చింది. ప్రస్తుతం బీరు విక్రయాలు తగ్గుముఖం పట్టాయని ప్రముఖ కన్నడ దినపత్రిక విజయవాణి పేర్కొంది.

 The sales of the beers fell after the Karnataka government hiked the prices of the beers

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి బీరు సుంకం పెంచింది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీర్ల ధర మూడు సార్లు పెరిగింది. గత ఎనిమిది నెలల్లో ఒక్కో బీరుపై సుమారు రూ. 40 పెరిగింది. ఫిబ్రవరి 1వ తేదీ నుండి కర్ణాటక ప్రభుత్వం బీర్‌పై సుంకాన్ని పెంచింది. అంటే దీని నుంచి బీరు కొనేందుకు రూ.12 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. అందుకే ఈ నెల మొదటి వారంలోనే బీరుకు డిమాండ్ పడిపోయింది.

గతేడాది కంటే ఈసారి బీర్ల విక్రయాలు తగ్గిపోయాయి. గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ అంటే ఫిబ్రవరి మొదటి వారంలో మొత్తం 7. 2 లక్షల కేసుల బీర్లు విక్రయాలు జరిగాయి. అయితే ఈ ఏడాది ఇదే కాలంలో (ఫిబ్రవరి మొదటి వారం)లో కేవలం 6. 4 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. నిరంతరాయంగా ధరలు పెరగడమే ఇందుకు కారణమని తెలిసింది. ధరలు నిరంతరం పెరుగుతున్నప్పటికీ డిమాండ్, అమ్మకాలు తగ్గినప్పటికీ సిద్దరామయ్య ప్రభుత్వానికి బీర్ నుండి వచ్చే ఆదాయాన్ని కోల్పోలేదు.

ఎందుకంటే అదనంగా వసూలు చేసిన రేటు ప్రభుత్వానికి లాభాలను తెచ్చిపెట్టింది. దేశీ మద్యం విక్రయాలు, వ్యాపారంలో ఎలాంటి ఇబ్బంది లేదని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. తక్కువ ధరకు లభించే బీర్లకు డిమాండ్ పెరగడంతోపాటు ధరల పెంపు తర్వాత ప్రభుత్వ ఎక్సైజ్ శాఖకు ఆశించిన ఆదాయం వస్తోంది. ఈ ధరల పెంపు బీర్ ప్రియులను ఇబ్బంది పెడుతోంది. ఇదిలావుండగా రూ. 185 నుంచి రూ 200 ధర ఉన్న బీర్ కు బదులు రూ. 130 నుంచి రూ 140 ధర కలిగిన పలు కంపెనీల బీర్ లను మందుబాబులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఇటీవల తక్కువ ధరకు లభించే బీర్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+