Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అర్దరాత్రి తండ్రిని చంపేసిన కొడుకు, భార్యకు ఫోన్ చేసి ఏం చెప్పాడంటే ?, కన్నింగ్ !

చెన్నై/ కడలూరు: దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. దంపతులకు కష్టపడి కొడుకును పెంచి పోషించి అతనికి పెళ్లి చేశారు. కొడుకు, అతని భార్యతో సంతోషంగా కాపురం చేసి పిల్లలకు తండ్రి అయ్యాడు. తల్లిదండ్రులు ఒక ఇంటిలో, కొడుకు అతని భార్య, పిల్లలు అదే భవనంలోని మరో ఇంటిలో నివాసం ఉంటున్నారు. అయితే అక్కడే అసలు కథ మొదలైయ్యింది.

తమిళనాడులోని కడలూరు జిల్లా పన్రుటి పక్కన ఉన్న ఎల్‌ఎన్ పురం ప్రాంతానికి చెందిన గవర్నర్ రాము అలియాస్ రాము (69) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రాము సైకిల్ రిపేర్ షాప్ నడిపేవాడు. గత నెల 24వ తేదీ రాత్రి యథావిధిగా ఇంటి ముందు పడుకుని నిద్రపోయిన రాము మరుసటి రోజు ఉదయం చూసే సరికి రక్తపు గాయాలతో ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు.

The son who killed his father at night for house and property and played dramas near Kadalur
రాము శవాన్ని చూసి షాక్ తిన్న ఆయన కుటుంబీకులు పన్రుటి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పన్రుటి పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న రాము మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ముండియంబాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అనంతరం స్నిఫర్ డాగ్‌ని పిలిపించి, హత్యకు గల కారణాలపై చురుగ్గా విచారణ జరుపుతుండగా మృతుడి కుటుంబ సభ్యులందరి సెల్‌ఫోన్ నంబర్లను పోలీసులు చురుగ్గా పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. రాము కొడుకు పురుషోత్తమన్ (45) మా నాన్నను కొట్టి చంపేశానంటూ అతని భార్యతో మాట్లాడిన 20 నిమిషాల ఆడియో టేపు స్వాధీనం చేసుకుని అందులోని మాటలు విన్న పోలీసులు షాక్ అయ్యారు.

The son who killed his father at night for house and property and played dramas near Kadalur

ఇంటి స్థలం పంపకాల విషయంలో తరచూ గొడవలు జరుగుతుండటంతో తండ్రి రామును రోలింగ్‌ రాడ్ తో కొట్టి చంపినట్లు ఆయన కుమారుడు పురుషోత్తమన్‌ విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపాడు. అయితే అంతకు ముందే తన తండ్రి రామును ఎవరో కొట్టి చంపారని ఆయన కొడుకు పురుషోత్తమన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని పోలీసు అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో పురుషోత్తమన్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇంటి స్థల వివాదంతో తండ్రిని ఆయన సొంత కొడుకు కొట్టి చంపిన ఘటన పన్రుటి ప్రాంత ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆస్తి కోసం కన్నతండ్రిని ఆయన కొడుకు హత్య చెయ్యడంతో వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+