భార్య అక్రమ సంబంధం: కాంగ్రెస్ నేత ఆత్మహత్య
జలంధర్: తన భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటుందని ఓ కాంగ్రెస్ లీడర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పంజాబ్లోని జలంధర్లో చోటు చేసుకుంది. పోలీసులతెలిపిన వివరాల ప్రకారం పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలోని మైనారిటీ సెల్కి డిప్యూటీ ఛైర్మన్గా సుభాష్ చందర్ (35) మంగళవారం జగత్ పురా ప్రాంతంలోని ఓ ఆలయంలో తుపాకీతో తలను పేల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
సుభాష్ చందర్ భార్య మరో వ్యక్తితో చాలా కాలంగా సన్నిహితంగా ఉంటోంది. ఈ విషయం తెలుసుకుని తీవ్ర మసస్తాపానికి గురైన సుభాష్ ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇదే విషయాన్ని సూసైడ్ నోట్లో కూడా పేర్కొన్నాడు.
తన భార్య మనీషా, ఆమె తల్లి సీతాతో పాటు నా భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్న రాజ్ కూడా తన చావుకి కారణమంటూ అందులో పేర్కొన్నాడు. సంఘటనా స్థలంలో .32 బోర్ దేశీయ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తన ఆత్మహత్యకు అత్త కూడా ఓ కారణమని సుభాష్ సూసైడ్నోట్లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది.సుభాష్ చందర్ సూసైడ్ నోట్ ఆధారంగా సుభాష్ భార్య, ఆమె స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.